న్యూఢిల్లీ, జూన్ 10: కొలంబియా సమీపంలో దాదాపు రెండు వందల ఏండ్ల కింద మునిగిపోయిన రెండు నౌకల శిథిలాల కింద అధికారులు భారీ మొత్తంలో బంగారాన్ని గుర్తించారు. వీటి విలువ రూ.1.32 లక్షల కోట్ల పైమాటే అని అంచనా వేస్తున్నారు. స్పెయిన్కు చెందిన ప్రఖ్యాత శాన్జోస్ నౌకకు సమీపంలో ఈ శిథిలాలు కనిపించాయి. 1708లో శాన్ జోస్ నౌక బ్రిటి ష్ దాడుల్లో మునిగిపోయింది. ఈ నౌక శిథిలాలను 2015లో గుర్తించారు. అప్పటి నుంచి నౌక గురించి తెలుసుకొనేందుకు కొలంబియా ప్రభుత్వం పరిశోధనలు చేస్తున్నది. ఈ క్రమంలో సముద్ర గర్భంలోకి రిమోట్ వాహనాన్ని పంపగా తాజాగా ఈ రెండు నౌకలు కనిపించాయి.