పుణే, మార్చి 29: బీజేపీ ఎంపీ, మహారాష్ట్ర మాజీ మంత్రి గిరీశ్ బాపట్ (72) కన్నుమూశారు. పుణే నుంచి లోక్సభకు ప్రాతినిధ్యం వహిస్తున్న గిరీశ్.. బుధవారం స్థానిక దీన్నాథ్ మంగేష్కర్ దవాఖానలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. గత కొంతకాలంగా ఆయన అనారోగ్యంతో బాధపడుతున్నారు.
పుణేలోని కస్బాపేట్ నుంచి ఐదుసార్లు ఎమ్మెల్యేగా నెగ్గిన ఆయన 2019లో పుణే నుంచి ఎంపీగా ఎన్నికయ్యారు. గిరీశ్ మృతికి ప్రధాని మోదీతో పలువురు ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు.