న్యూఢిల్లీ: కరోనా మహమ్మారి నిర్మూలన కోసం మొదలుపెట్టిన వ్యాక్సినేషన్ కార్యక్రమం విజయవంతంగా కొనసాగుతున్నది. ముందుగా వైద్యసిబ్బంది, పారిశుద్ధ్య సిబ్బందికి టీకాలు వేసిన అధికారులు, ఆ తర్వాత పోలీసులు, ఇతర భద్రతా బలగాలకు వ్యాక్సినేషన్ మొదలుపెట్టారు. మరికొన్ని రోజుల్లో వృద్ధులు, దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న సాధారణ ప్రజలకు టీకాలు వేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.
మరోవైపు ఇప్పటికే టీకా తొలి డోస్ తీసుకున్న వారికి రెండో డోస్ ఇచ్చే కార్యక్రమాన్ని కూడా శనివారం మొదలుపెట్టారు. వ్యాక్సినేషన్ ప్రక్రియ మొదటి రోజైన జనవరి 16న తొలి డోస్ వ్యాక్సిన్ తీసుకున్న అందరికీ ఇవాళ రెండో డోస్ ఇస్తున్నారు. ఢిల్లీలోని బీబీటీ నగర్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్లో సెకండ్ డోస్ వ్యాక్సినేషన్ సంబంధించిన దృశ్యాలను కింది చిత్రాల్లో చూడవచ్చు.