వారణాసి, ఏప్రిల్ 17: వారణాసిలో ప్రసిద్ధి చెందిన జ్ఞానవాపి మసీదులో మతాచార వజు (కాళ్లు, చేతులు కడుక్కోవడం) కోసం తగిన ఏర్పాట్లు చేయవచ్చునా అనే అంశం పరిశీలనకు సమావేశం నిర్వహించాలని వారణాసి జిల్లా కలెక్టర్ను సుప్రీం కోర్టు ఆదేశించింది.
ముస్లింలకు పవిత్రమైన రంజాన్ మాసాన్ని పురస్కరించుకుని జ్ఞానవాపి మసీదులో ‘వజు’ నిర్వహణకు అనుమతి ఇవ్వాలంటూ అంజుమన్ ఇంతెజామియా మసీదు కమిటీ దాఖలు చేసిన పిటిషన్ను చీఫ్ జస్టిస్ డీవై చండ్రచూడ్, జస్టిస్లు పీఎస్ నరసింహ, జేబీ పార్థివాల ధర్మాసనం సోమవారం విచారించింది.