న్యూఢిల్లీ : పాకిస్తాన్ వ్యవస్ధాపకుడు మహ్మద్ అలీ జిన్నా పేరును ఇటీవల రాజకీయ నేతలు తరచూ ప్రస్తావిస్తూ వివాదాలకు కేంద్ర బిందువవుతున్నారు. ఎస్పీ చీఫ్ అఖిలేష్ యాదవ్, సహల్దేవ్ భారతీయ సమాజ్ చీఫ్ ఓం ప్రకాష్ రాజ్భర్ల తర్వాత తాజాగా జేడీ(యూ) ఎమ్మెల్సీ ఖలీద్ అన్వర్ జిన్నాపై చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. జిన్నా గొప్ప స్వాతంత్ర్య సమరయోధుడని ఖలీద్ అన్వర్ పేర్కొగా బీజేపీ స్పందిస్తూ ఆయనను పాకిస్తాన్ వెళ్లాలని కోరింది.
జిన్నా గొప్ప స్వాతంత్ర్య సమరయోధుడని, దేశ తొలి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ వల్లనే దేశ విభజన జరిగిందని ఖలీద్ అన్వర్ పేర్కొన్నారు. దేశ స్వాత్రంత్యం కోసం జిన్నా గట్టిగా పోరాడాడని, దీనిపై ఎవరికీ సందేహాలు అవసరం లేదని అంటూ పాకిస్తాన్ ఏర్పాటు ద్వారా దేశ విభజనకు జిన్నా పూనుకున్నాడని, దీనికి ఆయనను నిందించడం సరైంది కాదని అన్వర్ పేర్కొన్నారు.
దేశ విభజనకు జిన్నాతో పాటు కాంగ్రెస్ కూడా బాధ్యత వహించాలని ప్రధాని పగ్గాలు చేపట్టేందుకు పండిట్ జవహర్లాల్ నెహ్రూ దేశ విభజనపై ముందుకెళ్లారని అన్వర్ ఆరోపించారు. ఇది తన వ్యక్తిగత అభిప్రాయమే కాదని, తమ పార్టీ వైఖరి కూడా ఇదేనని ఆయన తేల్చిచెప్పారు. అన్వర్ వ్యాఖ్యలపై అభ్యంతరం వ్యక్తం చేసిన బీజేపీ ఆయన పాకిస్తాన్ వెళ్లాలని మండిపడింది.