న్యూఢిల్లీ: నల్లధనం కట్టడి, నోట్ల చలామణీ తగ్గించడం, డిజిటల్ చెల్లింపులను ప్రోత్సహించడం.. తద్వారా ఆర్థిక వ్యవహారాల్లో పారదర్శకత తీసుకురావడం కోసమంటూ కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం పెద్ద నోట్లు రద్దు చేసి సోమవారానికి (నవంబర్ 8) ఐదేండ్లు. కానీ, ఈ ఐదేండ్లలో నగదు చలామణీ తగ్గకపోగా భారీగా పెరిగింది. 2016లో పెద్ద నోట్లు రద్దు చేసినప్పుడు దేశంలో చలామణీలో ఉన్న నోట్ల విలువ రూ.17.74 లక్షల కోట్లు కాగా, ఈ అక్టోబర్ నాటికి అది రూ.29.17 లక్షల కోట్లకు పెరిగింది. అంటే ఈ ఐదేండ్లలో నగదు చలామణీ రూ.11.43 లక్షల కోట్లు పెరిగింది. ముఖ్యంగా కరోనా మహమ్మారి సృష్టించిన అస్థిర పరిస్థితుల నేపథ్యంలో రెండేండ్లుగా ప్రజలు నగదును దాచుకోవడానికి మొగ్గు చూపుతున్నారు. పెద్ద నోట్ల రద్దు తర్వాత దేశంలో డిజిటల్ చెల్లింపులు కూడా భారీగా పెరిగాయి. డెబిట్, క్రెడిట్ కార్డులు, నెట్ బ్యాంకింగ్, యూపీఐ, చెల్లింపు యాప్లు.. ఇలా పలు సాధనాల ద్వారా ప్రజలు డిజిటల్ లావాదేవీలు జరుపుతున్నారు. ముఖ్యంగా యూపీఐ ద్వారా ప్రతి నెల రికార్డు స్థాయిలో లావాదేవీలు జరుగుతున్నాయి. మోదీ ప్రభుత్వం ఐదేండ్ల కింద నవంబర్ 8న రూ.1000, రూ.500 నోట్లను రద్దు చేసింది.
ఆర్బీఐ గణాంకాల ప్రకారం దేశంలో నోట్ల చలామణీ ఇలా..