భువనేశ్వర్: ఒడిశాలో ఓ రైలుకు ప్రమాదం తప్పింది. సికింద్రాబాద్-అగర్తాలా ఎక్స్ప్రెస్లోని ఏసీ బోగీలో పొగ వెలువడటంతో ప్రయాణికులు భయాందోళనకు గురయ్యారు. అధికారులకు సమాచారం ఇవ్వడంతో రైలును బ్రహ్మపూర్ రైల్వేస్టేషన్లో ఆపేశారు. పొగ వెలువడటానికి గల కారణాన్ని గుర్తించి పరిష్కరించారు. అయితే సమస్య పరిష్కారమైన తర్వాత రైలు ఎక్కడానికి చాలా మంది ప్రయాణికులు నిరాకరించారు. నాలుగు రోజుల కింద జరిగిన భారీ రైలు ప్రమాదాన్ని దృష్టిలో ఉంచుకొని ఏసీ బోగీని మార్చాలని అధికారులను కోరారు.