అహ్మదాబాద్లోని నానా చిలోడా ప్రజలు గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలను బహిష్కరించాలని నిర్ణయం తీసుకొన్నారు. తమను అహ్మదాబాద్ మున్సిపల్ కార్పొరేషన్లో కలిపినా.. తాగునీరు, కొత్త పాఠశాల భవనం, మురుగునీటి కాలువలను కల్పించటంలో బీజేపీ ప్రభుత్వం విఫలమైందని అసంతృప్తితో ఉన్నారు. మౌలిక సదుపాయాలు కల్పించేవరకు ఏ అభ్యర్థికీ ఓటు వెయ్యబోమని పోస్టర్లు వేసి మరీ తేల్చిచెప్తున్నారు. దీనికి సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ‘ఇదీ గుజరాత్ మాడల్’ అంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.