న్యూఢిల్లీ, మే 8: కరోనా కేసులు అనూహ్యంగా పెరుగుతున్న నేపథ్యంలో ఖైదీలతో కిక్కిరిసి ఉన్న జైళ్ల పై ఆందోళన వ్యక్తమవుతున్నదని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. జైళ్లలో రద్దీని తగ్గించేందుకు వీలుగా గత ఏడాది మార్చిలో ఆయా రాష్ర్టాలకు చెందిన ఉన్నతస్థాయి కమిటీల సిఫారసు మేరకు బెయిల్ లేదా పెరోల్పై విడుదలై మళ్లీ జైళ్లకు వచ్చిన ఖైదీలను వెంటనే మళ్లీ విడుదల చేయాలని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ నేతృత్వంలో జస్టిస్ ఎల్ నాగేశ్వరరావు, జస్టిస్ సూర్యకాంత్తో కూడిన ధర్మాసనం ఆదేశించింది.