కాచిగూడ, జూలై 9: పల్లె-పట్టణ ప్రగతిలో భాగంగా హరిత తెలంగాణే ధ్యేయంగా సీఎం కేసీఆర్ రాష్ట్ర వ్యాప్తంగా మొక్కలను నాటుతున్నారని, రాష్ట్రం సుభిక్షంగా ఉండలాంటే కాలుష్య రహిత ప్రకృతిని అందించేందుకు పచ్చని చెట్లు ఎంతగానో ఉపయోగ పడతాయని ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్ అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన పట్టణ ప్రగతితో తెలంగాణ రూపు రేఖలు మారనున్నాయని ఆయన అన్నారు. పది రోజుల పాటు నిర్వహిస్తున్న పట్టణ ప్రగతిలో భాగంగా 9వ రోజు శుక్రవారం గోల్నాక డివిజన్లోని కృష్ణానగర్ బస్తీలో ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్, గోల్నాక కార్పొరేటర్ దూసరి లావణ్యశ్రీనివాస్గౌడ్ కలసి పాల్గొని బస్తీలోని రోడ్డుకు ఇరువైపుల ఉన్న చెత్తాచెదరాన్ని తొలగించి, మొక్కలను నాటారు. అనంతరం ఎమ్మెల్యే కృష్ణానగర్ బస్తీలో పాదయాత్ర చేసి స్థానికుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. రాబోయే తరాలకు పచ్చదనాన్ని ఇవ్వడమే సీఎం కేసీఆర్ లక్ష్యమని, అందుకు తమవంతు బాధ్యతగా ప్రతి ఒక్కరూ మొక్కలను నాటాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో అధికారులు డీసీ వేణుగోపాల్, ఏఎంహెచ్ఓ జ్యోతిబాయి, దూసరి శ్రీనివాస్గౌడ్, డివిజన్ అధ్యక్షుడు భరత్రాజ్ముదిరాజ్, లింగంగౌడ్, భూపతి లక్ష్మణ్, ఆర్కేబాబు, రెడపాక రాము, అంజయ్యచారి, కొమ్ము శ్రీను, కాలేరు రామకృష్ణ, బుచ్చిరెడ్డి, కాలేరు రాజు, శ్రీను, ప్రభాకర్, సురేశ్, సతీశ్, టి. పల్లవి, లక్ష్మీముదిరాజ్, ధనలక్ష్మి, ఉమ, దివ్య, బాల్రాజు, శ్రీకాంత్, నరేశ్, మోహన్ తదితరులు పాల్గొన్నారు.