తాంసి, జూన్ 14: విద్యాభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తున్నదని బోథ్ ఎమ్మెల్యే రాథోడ్ బాపురావ్ అన్నారు. మండలంలోని పొన్నారిలో జిల్లాపరిషత్ నిధులు రూ.5లక్షలతో తరగతి గది నిర్మాణానికి సోమవారం భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు.పాఠశాలల్లో మౌలిక సదుపాయాల కల్పనకు ప్రభుత్వం కోట్లాది రూపాయలు విడుదల చేస్తున్నదని తెలిపారు.
కల్యాణలక్ష్మి చెక్కుల అందజేత..
కల్యాణలక్ష్మి, షాదీముబారక్ ద్వారా 23 మందికి చెక్కులు మంజూరు కాగా లబ్ధిదారులకు ఎమ్మెల్యే పంపిణీ చేశారు. సీఎం కేసీఆర్ అన్ని వర్గాలకూ వివిధ పథకాల ద్వారా లబ్ధి చేస్తున్నారన్నారు. కార్యక్రమంలో జడ్పీటీసీ తాటిపెల్లి రాజు, ఎంపీపీ సురకుంటి మంజుల-శ్రీధర్రెడ్డి, తహసీల్దార్ సంధ్యారాణి, ఎంపీడీవో రవీందర్, రైతుబంధు సమితి మండల అధ్యక్షుడు గోవర్ధన్రెడ్డి, టీఆర్ఎస్ జిల్లా కార్యదర్శి నాగారెడ్డి, సర్పంచ్లు కృష్ణ, వెంకన్న, కేశవ్రెడ్డి, సదానందం, సంజీవ్రెడ్డి, నర్సింగ్, శ్రీనివాస్, ఎంపీటీసీలు రేఖరఘు, సంతోష్, పీఏసీఎస్ వైస్ చైర్మన్ ధనుంజయ్, నాయకులు అరుణ్కుమార్, రమేశ్, చిన్నయ్య, విలాస్, మల్లయ్య పాల్గొన్నారు.
గుడిహత్నూర్లో..
గుడిహత్నూర్,జూన్14: మండల కేంద్రంలోని తహసీల్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో కల్యాణలక్ష్మి, షాదీముబారక్ చెక్కులను లబ్ధిదారులకు బోథ్ ఎమ్మెల్యే రాథోడ్ బాపురావ్ పంపిణీ చేశారు. మొత్తం 63 మందికి చెక్కులు మంజూరయ్యాయి. వాటితో పాటు సీఎంఆర్ఎఫ్ చెక్కులు కూడా అందించారు. కార్యక్రమంలో సర్పంచ్లు జీ తిరుమల్ గౌడ్, మీనా, ఎంపీటీసీలు న్యాను, శగీర్ఖాన్, మన్నూర్ పీఏసీఎస్ చైర్మన్ కరాడ్ ప్రకాశ్, ఏఎంసీ వైస్ చైర్మన్ జంగు, టీఆర్ఎస్ మండల కన్వీనర్ కరాడ్ బ్రహ్మానంద్, తహసీల్దార్ పవన్చంద్ర, టీఆర్ఎస్ నాయకులు బీ లక్ష్మీనారాయణ, ఎండీ గఫార్, ఫడ్ దిలీప్, లింగంపెల్లి రాజేశ్వర్, జలంధర్, కొల్లూరి వినోద్, లక్ష్మణ్, వివిధ గ్రామాల మహిళలు పాల్గొన్నారు.