రామగిరి, జనవరి 20: ప్రజా సమస్యలను పరిష్కరించడంలో ప్రత్యేక దృష్టి ఉంచి అధికారులు నిబద్ధతతో పనిచేయాలని జడ్పీ చైర్మన్ బండ నరేందర్రెడ్డి అన్నారు. నల్లగొండలో శుక్రవారం నిర్వహించిన జడ్పీ స్థాయీ సంఘం సమావేశాల్లో ఆయన మాట్లాడారు. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల అభివృద్ధి చేయాలని, ప్రజాల అవసరాలకు అనుగుణంగా ప్రణాళికలు చేయాలన్నారు. గ్రామీణ, ఐసీడీఎస్ పై చర్చ నిర్వహించారు. కార్యక్రమాల్లో ఎమ్మెల్సీ అల్గుబెల్లి నర్సిరెడ్డి, వైస్ చైర్మన్ ఇర్గి పెద్దులు, ఆయా స్థాయీ సంఘాల చైర్పర్సన్ కంకణాల ప్రవీణా, నారబోయిన స్వరూపారాణి పాల్గొన్నారు.