శాలిగౌరారం: తుంగతుర్తి నియోజకవర్గంలో ఊరురా గులాబీ జెండా రెపరెపలాడాలని ఎమ్మెల్యే గాదరి కిశోర్కుమార్ అన్నారు. బుధవారం మండల కేంద్రంలో నూతనంగా ఏర్పాటు చేసిన టీఆర్ఎస్ పార్టీ కార్యాలయాన్ని ఆయన ప్రారంభించి మాట్లాడుతూ నూతనంగా ఎన్నికైన టీఆర్ఎస్ గ్రామ శాఖలతో గ్రామాల్లో కొత్త శోభ సంతరించుకోని ఊరురా పార్టీ మరింత బలోపేతం కావాలని కోరారు.
తెలంగాణ ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమాలపై ప్రజలకు వివరించాలన్నారు. పార్టీ కోసం పనిచేసే కార్యకర్త లకు ఈ కమిటీలో గుర్తింపు లభిస్తుందని పేర్కొన్నారు. తిరుమలగిరి మండలానికి ఫైలెట్ ప్రాజెక్టుగా దళితబంధు పథకం తీసుకురావడం జరిగిందని, ఇందుకుగాను రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్కి ప్రత్యేక కృతజ్ణతలు తెలియజేశారు. అంతకు ముందు కార్యాలయం వద్ద పార్టీ జెండాను ఎగుర వేశారు.
కార్యక్రమంలో టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు ఐతగోని వెంకన్నగౌడ్, జడ్పీటీసీ ఎర్ర రణీల, కట్టా వెంకట్రెడ్డి, గుండా శ్రీనివా స్, తాళ్లూరి మురళి, మామిడి సర్వయ్య, గుజిలాల్ శేఖర్బాబు, జెర్రిపోతుల చంద్రమౌళిగౌడ్, లోకసాని రంగారెడ్డి, అక్కె నపెల్లి శ్రీరాములు, బట్ట వీరబాబు, వెంకన్న, దాసరి వెంకన్న, చిరబోయిన శ్రీనివాస్, పడాల సత్తయ్య ఉన్నారు.