ఆలేరు: ఆలేరు మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో శనివారం ఎన్నికల సన్నాహక సమావేశం జరిగింది. ఈ సమావేశం జరుగుతుండగా మోటకొండూర్ తహసీల్దార్ శాంతిలాల్ నాయక్ స్పృహతప్పి పడిపోయారు. ఇది గమనించిన అధికారులు ఆయనను హుటాహుటిన ఆలేరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి (PHC) తరలించారు. పరీక్షించిన వైద్యులు ఆయనకు గుండెపోటు వచ్చిందని తేల్చారు.
గుండెపోటు కారణంగా శాంతిలాల్ ఎడమ చేతి భాగం పనిచేయడం లేదని వైద్యులు వెల్లడించారు. కాగా, తహసీల్దార్ శాంతి లాల్ నాయక్ ఇప్పటికే బ్రెయిన్ ట్యూమర్తో బాధపడుతున్నారు. ఇప్పుడు గుండెపోటు వచ్చి ఎడమ చేయి పనిచేయకుండా పోవడంతో ఆయన పరిస్థితి విషాదకరంగా మారింది.