మోత్కూరు: రాష్ట్రంలో సీఎం కేసీఆర్ ప్రభుత్వం నిరుపేదలకు అండగా పనిచేస్తున్నదని తుంగతుర్తి ఎమ్మెల్యే గాదరి కిశోర్కుమార్ అన్నారు. మోత్కూరు మున్సిపాలిటీలో 7వ వార్డుకు చెందిన దుస్స భిక్షపతి లివర్ సంబంధిత వ్యాధితో అస్వస్థతకు గురై హైదరా బాద్లోని సన్షైన్ దవాఖానలో చేరాడు. లివర్ మార్పిడి కోసం పెద్ద మొత్తంలో ఖర్చు అవడంతో స్థానిక నాయకుల విన్నపం మేరకు ఎమ్మెల్యే కిశోర్కుమార్ సీఎం సహా యనిధి కోసం దరఖాస్తు చేసుకోవడంతో రూ.25లక్షలు మంజూరు చేశారు. ఈ మేరకు శనివారం ఎమ్మెల్యే కిశోర్కుమార్ తిరుమ లగిరి క్యాంపు కార్యా లయంలోభాధిత కుటుంబానికి అందజేశారు. కార్యక్రమంలో మున్సిపల్ కో అప్షన్ సభ్యులు గనగాని నర్సింహా, టీఆర్ఎస్ నాయకులు మంచే గోవర్దన్, కొక్కుల సత్యనారాయణ, చేనేత కార్మిక సంఘం నాయకులు పాశికంటి లక్ష్మినర్సయ్య పాల్గొన్నారు.