భువనగిరి: జిల్లాలోని వలిగొండ మండలంలో ఉన్న ధర్మారెడ్డి కాల్వకు గండి పడింది. ఎగువ నుంచి భారీగా వరద వస్తుండటంతో మండలంలోని సంగెం వద్ద కాలువ తెగిపోయింది. దీంతో వరద నీరు పంట పొలాల్లోకి చేరింది. కల్వర్టుల మీదుగా వరద ప్రవహిస్తున్నది. ఏదుళ్లగూడెం రైల్వే అండర్ పాస్ కిందికి నీరు చేరింది. దీంతో పలు గ్రామాలకు రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. అదేవిధంగా వలిగొండ వద్ద ఉధృతంగా మూసీ నది ప్రవహిస్తున్నది. బీబీనగర్-పోచంపల్లి బ్రిడ్జి మీదుగా వరద నీరు పోతున్నది.