బీబీనగర్, అక్టోబర్ 23 : బీబీనగర్ ఎయిమ్స్ డైరెక్టర్గా అమితా అగర్వాల్ గురువారం బాధ్యతలు స్వీకరించారు. గతంలో ఇక్కడ డైరెక్టర్గా పనిచేసిన వికాస్ భాటియా బదిలీపై వెళ్లగా అమె పూర్తిస్థాయి డైరెక్టర్గా బాధ్యతలు నిర్వర్తించనున్నారు. అమితా అగర్వాల్కు ఎయిమ్స్ అధ్యాపకులు, సిబ్బంది ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ఎయిమ్స్ అభివృద్ధితో పాటు విద్య, ఆరోగ్య సంరక్షణలో సంస్థాగత వృద్ధి సాధించేందుకు కృషి చేస్తానని తెలిపారు. అనంతరం ఎయిమ్స్ వైద్యులతో ఆమె సమావేశం నిర్వహించారు.
Bibinagar : ఎయిమ్స్ డైరెక్టర్గా అమితా అగర్వాల్ బాధ్యతల స్వీకరణ