హాలియా, ఫిబ్రవరి 12 : భువనగిరిలో శనివారం జరిగిన సీఎం కేసీఆర్ సభకు అనుముల మండలానికి చెందిన టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పార్టీ రాష్ట్ర నాయకుడు పాదం సంవత్కుమార్ ఆధ్వర్యంలో తరలివెళ్లారు. వారి వాహన ర్యాలీని పార్టీ మండలాధ్యక్షుడు కూరాకుల వెంకటేశ్వర్లు ప్రారంభించారు. కార్యక్రమంలో బొల్లం రవి, మున్సిపల్ చైర్మన్, మార్కెట్ చైర్మన్ గౌరవ సలహాదారులు వెంపటి శంకరయ్య, యడవల్లి మహేందర్రెడ్డి, నాయకులు గుంటుక వెంకట్రెడ్డి, పిడిగం నాగయ్య, తాటి సత్యపాల్, రవినాయక్, నరేందర్, కట్టెబోయిన అనిల్, ఎన్నమల్ల సత్యం, దోరేపల్లి వెంకటయ్య, ఉర్లగొండ వెంకటయ్య, వద్దిరెడ్డి శ్రీనివాస్రెడ్డి, వర్రా వెంకట్రెడ్డి, ప్రసాద్నాయక్, సురభి రాంబాబు పాల్గొన్నారు.
తిరుమలగిరి (సాగర్) : మండలం నుంచి వెళ్లిన వారిలో టీఆర్ఎస్ నాయకులు కట్టెబోయిన అనిల్కుమార్యాదవ్, మండలాధ్యక్షుడు పిడిగం నాగయ్య, పోతుగంటి తిరుమల్, పగడాల పెద్దిరాజు, ఎంపీటీసీ సలహాదారుడు పాండునాయక్, ముత్తయ్య, మల్లికార్జున్, శంకర్నాయక్ పాల్గొన్నారు.
నార్కట్పల్లి : మండల కేంద్రం నుంచి సీఎం కేసీఆర్ సభకు తరలివెళ్లిన టీఆర్ఎస్ నాయకుల వాహన శ్రేణిని ఎంపీపీ సూదిరెడ్డి నరేందర్ రెడ్డి జెండా ఊపి ప్రారంభించారు. పార్టీ మండలాధ్యక్షుడు బైరెడ్డి కరుణాకర్రెడ్డి, పట్టణాధ్యక్షుడు విష్ణు, నాయకులు బండ జగన్మోహన్ రెడ్డి, వివిధ గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీలు పాల్గొన్నారు
కట్టంగూర్ : జడ్పీటీసీ తరాల బలరాములు, పార్టీ మండలాధ్యక్షుడు ఊట్కూరి ఏడుకొండలు జెండా ఊపి వాహనాలను ప్రారంభించారు. కార్యక్రమంలో పీఏసీఎస్ చైర్మన్ నూక సైదులు, సర్పంచుల ఫోరం మండలాధ్యక్షుడు గుర్రం సైదులు, ఎంపీటీసీల ఫోరం మండలాధ్యక్షుడు పాలడుగు హరికృష్ణ, టీఆర్ఎస్ మండల ప్రధాన కార్యదర్శి వడ్డె సైదిరెడ్డి, పీఏసీఎస్ వైస్చైర్మన్ వెంకట్రెడ్డి పాల్గొన్నారు.
శాలిగౌరారం : కార్యకర్తల వాహనాలను మండలంలోని ఆకారంలో టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు ఐతగోని వెంకన్నగౌడ్ జెండాఊపి ప్రారంభించారు. కట్టా వెంకట్రెడ్డి, గుండా శ్రీనివాస్, గంట శంకర్, గుజిలాల్ శేఖర్బాబు, కల్లూరి నాగరాజుగౌడ్, జెర్రిపోతుల చంద్రమౌళిగౌడ్, బైరు నాగరాజుగౌడ్, చిర్రబోయిన శ్రీనివాస్, దాసరి వెంకన్న, నల్లగొండ శ్రీను పాల్గొన్నారు.
చిట్యాల : తరలివెళ్లిన వారిలో మున్సిపల్ చైర్మన్ కోమటిరెడ్డి చిన వెంకట్రెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ జడల ఆదిమల్లయ్య, టీఆర్ఎస్ మండల, పట్టణ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు ఆవుల అయిలయ్య, కల్లూరి మల్లారెడ్డి, పొన్నం లక్ష్మయ్య, జిట్ట చంద్రకాంత్, కూరెళ్ల లింగస్వామి, కోనేటి కృష్ణ, మెండె సైదులు, సిలువేరు శేఖర్, గుండెబోయిన సైదులు, నర్సింహ, శివప్రసాద్, సత్యనారాయణ ఉన్నారు.
కొండమల్లేపల్లి నుంచి టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు దస్రూనాయక్, సర్పంచుల ఫోరం మండలాధ్యక్షుడు కుంభం శ్రీనివాస్గౌడ్, రమావత్ తులసీరాం, రమావత్ శ్రీను, బద్రూ, రమేశ్, శ్రీను తరలివెళ్లారు.
నల్లగొండ రూరల్ : ఎమ్మెల్యే కంచర్ల భూపాల్రెడ్డి పిలుపు మేరకు నల్లగొండ నియోజకవర్గం నుంచి సుమారు 5వేల మంది టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు స్వచ్ఛందంగా తరలివెళ్లారు.