ఆలేరు, మే 30 : రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రతి ఇంటికీ చేరవేయాలని టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు గంగుల శ్రీనివాస్యాదవ్ పార్టీ శ్రేణులకు సూచించారు. సోమవారం మండల కేంద్రంతోపాటు గుండ్లగూడెం, పటేల్గూడెం, తూర్పుగూడెం, గొలనుకొండ, మంతపురి, సారాజీపేటలో టీఆర్ఎస్ గ్రామ కమిటీల సమావేశాలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జూన్ 2న రాష్ట్ర అవతరణ వేడుకలను ఘనంగా నిర్వహించాలన్నారు. సమావేశాల్లో గుండ్లగూడెం సర్పంచ్ ఏసిరెడ్డి మహేందర్రెడ్డి, మామిడాల భాను, అయిలి కృష్ణ, టీఆర్ఎస్ గ్రామశాఖల అధ్యక్షులు, ఉపాధ్యక్షులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
బొమ్మలరామారం : రాష్ట్ర అవతరణ వేడుకలను మండల వ్యాప్తంగా ఘనంగా జరుపుకోవాలని టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు పోలగాని వెంకటేశ్గౌడ్ పార్టీశ్రేణులకు సూచించారు. సోమవారం మండలంలోని మల్యాల, మైసిరెడ్డిపల్లి, రంగాపూర్ గ్రామాల్లో టీఆర్ఎస్ గ్రామశాఖల సమావేశాల్లో ఆయన మాట్లాడారు. టీఆర్ఎస్ అనుబంధ సంఘాలు, కార్యకర్తలు, ప్రజాప్రతినిధులు సమన్వయంతో వేడుకలు నిర్వహించాలని అన్నారు. కార్యక్రమంలో మార్కెట్ కమిటీ డైరెక్టర్ రామిడి రాంరెడ్డి, సర్పంచ్ రామిడి ప్రభాకర్రెడ్డి, నాయకులు తుంగని బాషయ్య, మర్రి రాంరెడి, జూపల్లి భరత్, కేసారం రవి పాల్గొన్నారు.
రాజాపేట : రాష్ట్ర అవతరణ వేడుకలను ఘనంగా నిర్వహించాలని టీఆర్ఎస్ మండల ప్రధాన కార్యదర్శి రెడ్డబోయిన రాజు సూచించారు. సోమవారం మండలంలోని బూర్గుపల్లిలో నిర్వహించిన సన్మాహక సమావేశంలో ఆయన మాట్లాడారు. సమావేశంలో టీఆర్ఎస్ గ్రామశాఖ అధ్యక్షుడు బంగారురెడ్డి, నాయకులు చింతల సంపత్, యాకూబ్రెడ్డి, గౌరప్ప, సిద్ధిరాములు పాల్గొన్నారు.