చౌటుప్పల్, మే 25 : హనుమాన్ చాలీసాను పాటిస్తే సకల దోషాలు దూరమవుతాయని మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్రెడ్డి అన్నారు. స్థానిక పాటిమీది భక్తాంజనేయ స్వామి ఆలయంలో బుధవారం నిర్వహించిన హనుమాన్ జయంతి వేడుకల్లో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ హనుమాన్ జయంతిలో పాల్గొనడం అదృష్టంగా భావిస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ వెన్రెడ్డి రాజు, మార్కెట్ కమిటీ చైర్మన్ బొడ్డు శ్రీనివాస్రెడ్డి, వైస్ చైర్మన్ బత్తుల శ్రీశైలంగౌడ్, ఆలయ కమిటీ సభ్యులు, భక్తులు పాల్గొన్నారు.
రామన్నపేట : మండల కేంద్రంతో పాటు పలు గ్రామాల్లో హనుమాన్ జయంతిని ఘనంగా నిర్వహించారు. కలశస్థాపనతోపాటు నవగ్రహ పూజలు చేశారు. పంచామృతాలతో అభిషేకాలు నిర్వహించారు. సింధూరంతో అలంకరించి హోమం జరిపారు. వెల్లంకిలో సర్పంచ్ ఎడ్ల మహేందర్రెడ్డి ఆధ్వర్యంలో పూజలు నిర్వహించి అన్నదానం చేశారు. పట్టణ కేంద్రంలో యువకులు బైక్ర్యాలీ నిర్వహించారు.
రాజాపేట : మండలంలోని పలు గ్రామాల్లో హనుమాన్ జయంతి వేడుకలను బుధవారం భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. ఈ సందర్భంగా హనుమాన్ ఆలయాల్లో పూజలు చేశారు. పుట్టెగూడెంలో హనుమాన్ మాలధారులు ఇరుముడి కట్టుకొని ప్రదర్శన నిర్వహించారు.
బొమ్మలరామారం : మండల కేంద్రంతోపాటు రామలింగంపల్లి, మర్యాల, ప్యారారం, ఫకీర్గూడ, నాగినేనిపల్లి, పెద్దపర్వతాపూర్లో హనుమాన్ జయంతిని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయాల్లో అభిషేకం, ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం హనుమాన్ విగ్రహాన్ని ఊరేగించారు. ఎంపీటీసీ ఎర్వ హేమంత్రెడ్డి, కాటం ఐలేశ్, మన్నె శ్రీధర్, వడ్లకొండ ఆనంద్, బోయిని నర్సింహ, గణేశ్, నాగరాజు, కృష్ణ పాల్గొన్నారు.
యాదాద్రి : హనుమాన్ జయంతి సందర్భంగా యాదగిరిగుట్టలో హనుమాన్ శోభాయాత్ర నిర్వహించారు. పట్టణంలోని కొత్తగుండ్లపల్లి నుంచి యాదగిరిపల్లి వరకు యాత్ర సాగింది. కార్యక్రమంలో ఆలేరు మాజీ ఎమ్మెల్యే బూడిద భిక్షమయ్యగౌడ్, టీఆర్ఎస్ పట్టణాధ్యక్షుడు పెలిమెల్లి శ్రీధర్గౌడ్, యువజన విభాగం పట్టణాధ్యక్షుడు ముఖ్యర్ల సతీశ్యాదవ్, కౌన్సిలర్ దండెబోయిన అనిల్ పాల్గొన్నారు.