– కోదాడ మున్సిపల్ చైర్పర్సన్ ఎర్నేని కుసుమ
కోదాడ, ఫిబ్రవరి 25 : నాయి బ్రాహ్మణుల సమస్యల పరిష్కారానికి తన వంతు సహకారం అందిస్తానని కోదాడ మున్సిపల్ చైర్పర్సన్ ఎర్నేని కుసుమ వెంకటరత్నం బాబు హామీ ఇచ్చారు. బుధవారం కోదాడ నాయి బ్రాహ్మణ సేవా సంఘం పట్టణ అధ్యక్షుడు ఆలేటి గోపి ఆధ్వర్యంలో చైర్పర్సన్ దంపతులను ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఎమ్మెల్యే పద్మావతి రెడ్డి సహకారంతో నాయి బ్రాహ్మణులకు ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందేలా చూస్తానని తెలిపారు. ఈ కార్యక్రమంలో సంఘం పెద్దలు సురభి నరసయ్య, తాడేపల్లి గోవిందరావు, ఆలేటి చిన్న సత్యనారాయణ, మాధవరపు సీతారాములు, ఆలేటి వెలగొండ,ఆలేటి వెంకటేశ్వర్లు, గుడిమల్ల శ్రీహరి, వినుకొండ శ్రీనివాస్, సన్నాయిల వీరబాబు, తూముల రాంబాబు, కేతవరపు సైదులు, పిన్నెల్లి మురళి, వెన్నెల శీను, ఆలేటి సహదేవ్ తాడేపల్లి రాము పాల్గొన్నారు.