నేరేడుచర్ల : నియోజకవర్గ వ్యాప్తంగా గ్రామాల్లో మౌలిక వసతుల కల్పనే లక్ష్యమని ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి అన్నారు. సోమవారం మండలంలోని దిర్శించర్లలో డీఎంఎఫ్టీ నిధుల నుంచి మంజూరైన రూ. 5లక్షలతో చేపట్టిన సీసీరోడ్డు పనులను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలోనే హుజూర్నగర్ నియోజకవర్గాన్ని ఆదర్శంగా తీర్చిదిద్దేందుకు మూడున్నరేండ్లలోనే రూ.3,500 కోట్లకు పైగా నిధులు తీసుకొచ్చినట్లు తెలిపారు. ఒకటో వార్డులో సమస్యలు పరిష్కరించాలని కోరగా వార్డు మొత్తం తిరిగి సమస్యల పరిష్కారానికి నిధులు మంజూరు చేస్తానన్నారు. చర్చిని సందర్శించి ప్రత్యేక ప్రార్థనలు చేశారు. నేరేడుచర్లలో నిర్వహించిన సెమీ క్రిస్మస్ సెలబ్రేషన్స్లో పాల్గొన్నారు. ఎంపీపీ లకుమళ్ల జ్యోతి, జడ్పీటీసీ రాపోలు నర్సయ్య, వైస్ ఎంపీపీ తాళ్లూరి లక్ష్మీనారాయణ, బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు అరిబండి సురేశ్బాబు, ప్రధాన కార్యదర్శి ఎల్లబోయిన లింగయ్య, చిల్లేపల్లి పీఏసీఎస్ చైర్మన్లు అనంత శ్రీనివాస్గౌడ్, శాఖమూడి శ్రీకాంత్ పాల్గొన్నారు.
అంకితభావంతో పనిచేయాలి
హుజూర్నగర్ : అంగన్వాడీలు అంకితభావంతో పని చేయాలని ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి సూచించారు. సోమవారం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో కొత్తగా నియామకమైన అంగన్వాడీ టీచర్లు, ఆయాలకు నియామకపత్రాలు అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉద్యోగ బాధ్యతలు స్వీకరించిన అంగన్వాడీలు సమర్థవంతంగా విధుల నిర్వహించి ప్రభుత్వ లక్ష్యాలు నెరవేర్చాలన్నారు. ఈ సందర్భంగా అంగన్వాడీలు ఎమ్మెల్యేను సన్మానించారు. అనంతరం ఇటీవల రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన అల్వాల లక్ష్మి కుటుంబ సభ్యులను ఎమ్మెల్యే పరామర్శించారు. కార్యక్రమంలో మఠంపల్లి, గరిడేపల్లి ఎంపీపీలు పార్వతి, పెండెం పద్మ, జడ్పీటీసీ కొప్పుల సైదిరెడ్డి, సీడీపీఓ విజయలక్ష్మి పాల్గొన్నారు.
సైన్స్ పరికరాల అందజేత
హుజూర్నగర్ : మండలంలోని బూరుగడ్డ, అమరవరం, లింగగిరి, కరక్కాయలగూడెం, హుజూర్నగర్ బాలికల, బాలుర ప్రభుత్వ ఉన్నత పాఠశాలలకు జడ్పీ నిధుల నుంచి మంజూరైన ఒకొక్క పాఠశాలకు రూ.లక్ష విలువైన సైన్స్ పరికరాలను ఎమ్మెల్యే సైదిరెడ్డి క్యాంప్ కార్యాలయంలో ఆయా పాఠశాలల ప్రధానోపాధ్యాయులకు అందజేశారు.
కార్యక్రమంలో జడ్పీటీసీ కొప్పుల సైదిరెడ్డి, సర్పంచులు సుజాత, షేక్ సలీమా, జయమ్మ, ఎంపీటీసీ విజయలక్ష్మి, బీఆర్ఎస్ పట్టణాధ్యక్షుడు అమర్నాథ్, ప్రధాన కార్యదర్శి అమర్, ప్రధానోపాధ్యాయులు శ్రీనివాస్, లతీఫ్, ఉదయశ్రీ, శ్రీనివాస్రెడ్డి, ప్రభాకర్రావు, వసంతరావు పాల్గొన్నారు.