భువనగిరి సిటీ, జనవరి 21 : 56వ తెలంగాణ రాష్ట్ర స్థాయి ఖోఖో పోటీల్లో పాల్గొనేందుకు ఉమ్మడి నల్లగొండ జిల్లా పురుషుల, మహిళల జట్లను భువనగిరి జిల్లా కేంద్రంలోని ఇండోర్ స్టేడియంలో ఆదివారం ఎంపిక చేశారు. ఎంపికైన క్రీడాకారులకు జనవరి 25 నుంచి ఫిబ్రవరి 8 వరకు సాయికృప కళాశాల క్యాంపస్లో కోచింగ్ క్యాంపు నిర్వహిస్తున్నట్లు ఉమ్మడి నల్లగొండ జిల్లా ఖోఖో సంఘం ప్రధాన కార్యదర్శి నాతి కృష్ణమూర్తి తెలిపారు. కోచింగ్ క్యాంపునకు 20 మంది మహిళలు, 20 మంది పురుషులను ఎంపిక చేసినట్లు చెప్పారు.
ఫిబ్రవరి 9నుంచి 11 వరకు జూనియర్ కళాశాల గ్రౌండ్లో రాష్ట్ర స్థాయి ఖోఖో పోటీలు జరుగుతాయని తెలిపారు. కార్యక్రమంలో ఖోఖో సంఘం ఉపాధ్యక్షుడు పి.రమేశ్రెడ్డి, కోశాధికారి ఎ.విజయ్, జాయింట్ సెక్రటరీ కె.మురళి, ఆర్గనైజ్ సెక్రటరీలు పి.ఆంజనేయులు, పి.శ్రీశైలం, జి.బాలకృష్ణ, సురేందర్, కోచ్ స్వాతి, పీఈటీలు బి.కేశనాగులు, నాగేంద్ర, వెంకట్రెడ్డి, క్రీడాకారులు పాల్గొన్నారు.