నల్లగొండ : దేవరకొండ మున్సిపాలిటీని ఆదర్శవంతంగా తీర్చిదిద్దుతా అని దేవరకొండ ఎమ్మెల్యే రమావత్ రవీంద్ర కుమార్ అన్నారు. మంగళవారం దేవరకొండ పట్టణంలోని 3వ వార్డులో రూ.9 లక్షలతో చేపడుతున్న డైనేజీ పనులకు ఎమ్మెల్యే రవీంద్ర కుమార్ శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..డ్రైనేజీ పనులు నాణ్యతతో త్వరితగతిన పూర్తి చేయాలని ఆయన కోరారు.
టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత దేవరకొండ పట్టణం దిన దినాభివృద్ధి చెందుతున్న తరుణంలో.. అందుకు తగిన విధంగా పట్టణాన్ని రూపందించు కోవడంలో అన్ని వర్గాల ప్రజలు, రాజకీయ నాయకులూ రాజకీయాలకు అతీతంగా ముందుకు రావాలని అని ఆయన పిలుపునిచ్చారు. పట్టణాన్ని మరింత సుందర పట్టణంగా తీర్చిదిద్దుకుని భావితరాలకు అద్భుతమైన పట్టణాన్ని అందించడం సాధ్యమవుతుందన్నారు.
కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ అల్లంపల్లి నర్సింహా, మార్కెట్ కమిటీ చైర్మన్ సిరందాసు లక్ష్మమ్మ, రైతు బంధు అధ్యక్షుడు శిరందాసు కృష్ణయ్య, మున్సిపల్ వైస్ చైర్మన్ రహత్ అలీ, కమిషనర్ వెంకటయ్య, టీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు హన్మంత్ వెంకటేష్ గౌడ్, టీఆర్ఎస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు పున్న వెంకటేశ్వర్లు, మాజీ చైర్మన్ వాడిత్య దేవేందర్, కౌన్సిలర్లు రజియాసుల్తానా, పొన్నబోయిన సైదులు, మూడవత్ జయప్రకాష్ నారాయణ, మహ్మద్ రైస్, వేముల రాజు, చిత్రం ప్రదీప్, బొడ్డుపల్లి కృష్ణ, మహ్మద్ తౌఫిక్ ఖాద్రీ, జింకల లింగయ్య, పలేపు అశోక్, అజీమ్, ఏఈ రాజు, తదితరులు పాల్గొన్నారు.