యాదగిరిగుట్ట, ఏప్రిల్ 22 : తమకు రాజకీయ జీవితాన్ని ఇచ్చిన గుండ్లపల్లిని ఎప్పటికీ మర్చిపోమని, గ్రామాన్ని ఎంతో అభివృద్ధి చేశామని ప్రభుత్వ విప్ గొంగిడి సునీత, డీసీసీబీ చైర్మన్ గొంగిడి మహేందర్రెడ్డి అన్నారు. శనివారం యాదగిరిగుట్ట పట్టణంలోని గుండ్లపల్లికి చెందిన బీజేపీ యువజన నాయకుడు ఆరె శివకమార్గౌడ్ ఆధ్వర్యంలో 100 మంది బీజేపీ నాయకులు, మహిళా నాయకులు ఆ పార్టీకి రాజీనామా చేసి బీఆర్ఎస్లో చేరారు. వారికి గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించి మాట్లాడారు. ఆలేరు మార్కెట్ కమిటీ చైర్మన్ గడ్డమీది రవీందర్గౌడ్, బీఆర్ఎస్ పట్టణాధ్యక్షుడు పెలిమెల్లి శ్రీధర్గౌడ్, మున్సిపల్ వైస్ చైర్మన్ మేడబోయిన కాటంరాజు, కౌన్సిలర్ ఆవుల మమతాసాయియాదవ్, బీఆర్ఎస్ 8వ వార్డు అధ్యక్షుడు శ్రీశైలం పాల్గొన్నారు.