ఆత్మకూర్.ఎస్, మే 06 : క్షయ నిర్మూలన ప్రతి ఒక్కరి సామాజిక బాధ్యత అని సూర్యాపేట జిల్లా ఆత్మకూర్.ఎస్ మండల వైద్యాధికారిని డాక్టర్ రమ్య అన్నారు. బుధవారం ఆమె మాట్లాడుతూ పాతర్లపాడు గ్రామం నందు టీబీ ముక్త్ భారత్ అభియాన్ కార్యక్రమంలో భాగంగా ఛాతి ఎక్స్రే శిబిరాన్ని ప్రారంభించడం జరుగుతుందని తెలిపారు. గతంలో టీబీ మందులు వాడిన వారు, వారి కుటుంబ సభ్యులు, షుగర్, బీపీ ఉన్నవాళ్లను, పొగ, మద్యపానం సేవించేవారు, రెండు వారాలకు మించి దగ్గు, బరువు కోల్పోవడం, తెమడలో రక్తం కనిపించడం, రాత్రి వేళలో జ్వరం ఉన్నట్లయితే క్షయ వ్యాధిగా అనుమానించి పరీక్షలు చేయించుకోవాలని సూచించారు. కావున ఈ అవకాశాన్ని ప్రజలందరూ వినియోగించుకోవాలని కోరారు.