రామగిరి, జనవరి 7 : టీఎస్యూటీఎఫ్ మైనార్టీ గురుకుల ఉమ్మడి జిల్లా కమిటీని ఆదివారం ఎన్నుకున్నారు. నల్లగొండలోని సంఘం కార్యాలయంలో నిర్వహించిన గురుకుల ఉపాధ్యాయుల ఆత్మీయ సమ్మేళనంలో కమిటీని ఎన్నుకున్నారు.
ఉమ్మడి జిల్లా అధ్యక్షుడిగా బొల్లెం కృష్ణమూర్తి, ప్రధాన కార్యదర్శిగా ప్రసాద్, కోశాధికారిగా కోమటి రామకృష్ణ, ఉపాధ్యక్షులుగా జ్యోతిబాబు, నూర్జహాన్, కార్యదర్శులుగా శంకర్, కె. రమాదేవి, అబ్దుల్ ముజీబ్, జంగయ్య, శ్వేత, అనిత ఎన్నికయ్యారు.
సంఘం రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు రాంబాబు, రాజశేఖర్రెడ్డి అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో సంఘం రాష్ట్ర కమిటీ సభ్యులు జి. క్రాంతి కుమార్, బొల్లం కృష్ణమూర్తి, జిల్లా సమన్వయ కమిటీ సభ్యులు కొప్పుల జనార్దన్, లక్ష్మణ్, మైనార్టీ గురుకులాల ఉపాధ్యాయులు పాల్గొన్నారు.