మిర్యాలగూడ పట్టణానికి చెందిన టీపీసీసీ రాష్ట్ర కార్యదర్శి అలుగుబెల్లి అమరేందర్రెడ్డి బీఆర్ఎస్లో చేరారు. హైదరాబాద్లో మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సమక్షంలో శనివారం గులాబీ కండువా కప్పుకొన్నారు.
చేరిక కార్యక్రమంలో మిర్యాలగూడ ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్ రావు, రైతుబంధు సమితి జిల్లా అధ్యక్షుడు చింతరెడ్డి శ్రీనివాస్రెడ్డి, మున్సిపల్ చైర్మన్ తిరునగరు భార్గవ్, బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు జొన్నలగడ్డ రంగారెడ్డి ఉన్నారు.