అర్వపల్లి, ఆగస్టు 22 : అర్వపల్లి మండల కేంద్రంలో శుక్రవారం అర్ధరాత్రి రిషిత వైన్స్ షాప్ -1 లో చోరీ జరిగింది. సీసీ కెమెరాలో రికార్డ్ అయిన ఫుటేజీ టైం ప్రకారం అర్దరాత్రి సుమారు 1-30 గంటల సమయంలో ఇద్దరు దుండగులు ముఖాలకు టవల్స్ చుట్టుకుని షట్టర్ తాళాలను పగలగొట్టి వైన్ షాప్ లోకి చొరబడ్డారు. విలువైన మద్యం బాటిళ్లు, కౌంటర్లో నగదు కలిపి సుమారు రూ.60 వేల వరకు అపహరణ జరిగిందని వైన్స్ నిర్వాహకులు తెలిపారు. విషయం తెలిసిన పోలీసులు సంఘటన స్థలాన్ని పరిశీలించి వివరాలను సేకరించారు. ఈ దోపిడీ ఆకతాయిల పనా? లేక ప్రొఫెషనల్ దొంగల పనా అనేది పోలీసుల దర్యాప్తులో తేలనుంది.