తల్లీబిడ్డల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నది. మాతా శిశు సంరక్షణకు పెద్ద పీట వేస్తున్నది. గర్భిణుల కోసం అనేక కార్యక్రమాలు చేపడుతున్నది. ఇప్పటికే కేసీఆర్ కిట్ను అందుబాటులోకి తెచ్చి విజయవంతంగా అమలు చేస్తుండగా.. తాజాగా గర్భిణుల కోసం మరో కొత్త పథకానికి శ్రీకారం చుట్టింది. ఇందులో భాగంగా పౌష్టికాహారం అందించేందుకు న్యూట్రిషన్ కిట్లకు రూపకల్పన చేసింది. 1962 రూపాయల విలువైన కిట్ను రెండు సార్లు అందించనున్నది. కిట్ల ద్వారా గర్భిణుల్లో రక్త హీనతను నివారించి, మాతా శిశు మరణాలను తగ్గించనున్నది. ఇప్పటికే ఈ పథకానికి బడ్జెట్లో నిధులు కేటాయించగా ఉమ్మడి నల్లగొండ జిల్లాలో సుమారు 30 వేల మందికి లబ్ధి చేకూరనున్నది.
యాదాద్రి భువనగిరి, ఫిబ్రవరి 12 (నమస్తే తెలంగాణ) : రాష్ట్రంలో చాలా మంది గర్భిణులు రక్తహీనతతో బాధపడుతున్నట్లు సరార్ గుర్తించింది. గర్భంలో బిడ్డ పెరుగుతున్న సమయంలో గర్భిణులు పౌష్టికాహారం తీసుకోవాల్సి ఉంటుంది. దీని వల్ల గర్భంలోని శిశువులు ఆరోగ్యకరంగా పెరుగుతారు. కానీ.. మారుమూల గ్రామాల్లోని మహిళలకు సరైన పౌష్టికాహారం లభించడం లేదని ప్రభుత్వం గుర్తించింది. ఈ క్రమంలో గర్భిణులు, గర్భంలోని శిశువు రక్షణ కోసం కేసీఆర్ న్యూట్రిషన్ కిట్ అందించాలని నిర్ణయించింది. ఈ పథకం ప్రస్తుతం 9 జిల్లాల్లో అమలవుతుండగా.. రాష్ట్ర వ్యాప్తంగా అందిస్తామని ఇటీవల బడ్జెట్ సమావేశాల్లో ప్రభుత్వం ప్రకటించింది. ఇందుకోసం బడ్జెట్లో ప్రత్యేకంగా రూ.200 కోట్లు కేటాయించింది. ఈ పథకం జిల్లాలో త్వరలోనే ప్రారంభం కానుంది. ఇది అమల్లోకి వస్తే ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 30వేల మందికి లబ్ధి చేకూరనుంది. యాదాద్రి జిల్లాలో సుమారు 7వేలు, నల్లగొండలో 13వేలు, సూర్యాపేట జిల్లాలో దాదాపు 10వేల
రక్తహీనత గర్భిణుల పాలిట శాపంగా మారుతున్నది. రక్తహీనత కారణంగా ప్రసవ సమయంలో రక్తం తకువగా ఉండి.. తల్లీబిడ్డలకు ఇబ్బందులు తలెత్తే ప్రమాదం ఉంది. దీనివల్ల ప్రసవాలు సంక్లిష్టంగా మారుతున్నాయి. రక్తహీనతను నివారించడం వల్ల మాతృ మరణాలు గణనీయంగా తగ్గే అవకాశం ఉంది. ప్రొటీన్స్, మినరల్స్, విటమిన్లు అధికంగా ఉండే పోషకాహారం ద్వారా రక్తహీనతను తగ్గించడం, హిమోగ్లోబిన్ శాతం పెంచడం న్యూట్రిషన్ కిట్ల లక్ష్యం. ఈ పోషకాహార కిట్ వల్ల గర్భిణులకు విటమిన్లు, మినరల్స్, ప్రొటీన్లు సరిపడా అందనున్నాయి.
మహిళా శిశు సంక్షేమ కోసం రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే కేసీఆర్ కిట్ పథకాన్ని విజయవంతంగా అమలు చేస్తున్నది. కిట్లతో పాటు డెలివరీ సమయంలో 12 వేల ఆర్థిక సాయం అందిస్తున్నది. జిల్లాలో ఇప్పటి వరకు 20,300 మందికి కేసీఆర్ కిట్లు అందించారు. అదేవిధంగా రూ.34 కోట్ల ఆర్థిక సాయం వారి బ్యాంకు ఖాతాల్లో జమ చేశారు. దాంతో ప్రభుత్వ ఆస్పత్రుల్లో ప్రసవాలు పెరుగడంతోపాటు మాతా శిశు మరణాల సంఖ్య కూడా తగ్గింది.
మాతా శిశు సంరక్షణ కోసం రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే అనేక కార్యక్రమాలు అమలు చేస్తున్నది. తాజాగా న్యూట్రిషన్ కిట్ పథకాన్ని తీసుకొచ్చింది. గర్భిణులకు 1,962 రూపాయల విలువైన బలవర్ధకమైన పోషకాహార కిట్ను రెండు సార్లు అందించనున్నారు. మొదటి కిట్ను గర్భం దాల్చిన 13-27 వారాల మధ్య జరిగే రెండో ఏఎన్సీ సమయంలో, రెండో కిట్ను 28-34 వారాల మధ్య చేసే మూడో ఏఎన్సీ చెకప్ సమయంలో ఇస్తారు.