నకిరేకల్, ఏప్రిల్ 21 : నకిరేకల్ పట్టణంలో షాదీఖాన నిర్మాణానికి కోటి రూపాయలను రాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేసింది. స్థానిక ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య శుక్రవారం ముఖ్యమంత్రి కేసీఆర్ను ప్రగతి భవన్లో ప్రత్యేకంగా కలిశారు. ఈ సందర్భంగా షాదీఖాన నిర్మాణానికి నిధులు మంజూరు చేయాలని కోరగా వెంటనే కోటి రూపాయలు విడుదల చేశారు. అలాగే బ్రాహ్మణవెల్లెంల ఉదయ సముద్రం ప్రాజెక్టు పనుల పూర్తికి నిధులు మంజూరు చేయాలని ఎమ్మెల్యే కోరారు. సానుకూలంగా స్పందించిన సీఎం మే నెలలో ట్రయల్ రన్ చేయాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. నియోజకవర్గంలోని పలు పెండింగ్ పనులు, రావాల్సిన నిధులపై కేసీఆర్కు ఎమ్మెల్యే వివరించారు. అధిక నిధుల కేటాయింపునకు ముఖ్యమంత్రి సుముఖత చూపినట్లు చిరుమర్తి తెలిపారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్కు ఎమ్మెల్యే కృతజ్ఞతలు తెలిపారు.
నకిరేకల్, ఏప్రిల్ 21 : నకిరేకల్ పట్టణ షాదీఖానా నిర్మాణానికి రూ. కోటి మంజూరు చేయడం పట్ల ముస్లిం మత పెద్దలు హర్షం వ్యక్తం చేస్తూ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య క్యాంప్ కార్యాలయంలో శుక్రవారం మర్యాద పూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా శాలు వా కప్పి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. అనంతరం జీఓ కాపీని ఎమ్మెల్యే చిరుమర్తి వారికి చూయించారు. సీఎం కేసిఆర్కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.
కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ రాచకొండ శ్రీనివాస్ గౌడ్, మార్కెట్ కమిటీ చైర్మన్ కొప్పుల ప్రదీప్రెడ్డి, మైనార్టీ నాయకులు జాఫర్, మోయిద్, యూసుఫ్, అమీర్పాషా, ఫయీం, మహ్మద్ అలీ, మత పెద్దలు మదార్ పాల్గొన్నారు.