నల్లగొండ, మార్చి 18 : నార్కట్పల్లి మండలం ఎల్లారెడ్డిగూడెం శివారులోని శ్రీవల్లి టౌన్షిప్లో ఉన్న ఓపెన్ప్లాట్లు, పాక్షిక గృహాల బహిరంగ వేలం శనివారం ముగిసింది. నాలుగో విడుతలో భాగంగా ఈ నెల 16 నుంచి జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ ఉదయాదిత్య భవన్లో వేలం ప్రక్రియ నిర్వహించగా.. 71 ఓపెన్ ప్లాట్లు, 33 పాక్షిక గృహాలను వినియోగదారులను కొనుగోలు చేశారు. దాంతో ప్రభుత్వానికి రూ.9 కోట్లా 25లక్షలా 50 వేల ఆదాయం సమకూరనున్నది.
ఇందుకోసం ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేసి రూ.10వేలు డీడీ రూపంలో చెల్లించిన బిడ్డర్లకు టోకెన్లు ఇచ్చి ధ్రువ పత్రాలను అధికారులే నింపి వేలానికి అనుమతించారు. ఇప్పటి వరకు వెంచర్లో ప్రభుత్వం రూ.2.70 కోట్లు వెచ్చించి రోడ్లు, విద్యుత్, నీటి వసతి, డ్రైనేజీ, ఎస్టీపీల నిర్మాణం చేపట్టింది. తొలి దశలో గజం రూ.7వేలు ఉండగా దానిని అందరికీ అందుబాటులోకి తేవాలనే ఉద్దేశంతో ప్రభుత్వం ఓపెన్ ప్లాట్ ధర రూ.6వేలు, పాక్షిక గృహాల ధర రూ.10 500గా నిర్ధారించింది. మూడో రోజు వేలం ప్రక్రియలో గృహ నిర్మాణ పీడీ రాజ్కుమార్, సీపీఓ బాలశౌరి, రాజీవ్ స్వగృహ ప్రాజెక్టు మేనేజర్ షఫి పాల్గొన్నారు.