చండూరు ఆగస్టు 23 : ఇటీవల అనారోగ్య కారణాలవల్ల మృతి చెందిన నల్లగొండ జిల్లా చండూరు మండలం బోడంగిపర్తి గ్రామానికి చెందినగ్రామశాఖ బీఆర్ఎస్ పార్టీ ఉపాధ్యక్షుడు, గ్రామపంచాయతీ 7 వార్డు మెంబర్ రేవెల్లి నరేష్ అనారోగ్య కారణంతో అకాల మరణం చెందారు. నిరుపేద కుటుంబానికి చెందిన వారు కావడంతో వారి కుటుంబానికి పార్టీలు, కులమతాలకు అతీతంగా బోడంగిపర్తి గ్రామానికి చెందిన ప్రజలు ఎవరికీ తోచినంత తమ వంతుగా ఆర్థిక సహాయం చేశారు. గ్రామ ప్రజల సాయంతో వచ్చిన 1,15,500 రూపాయలను రేవెల్లి నరేష్ కుటుంబానికి గ్రామ ప్రజలు అందజేశారు.
పార్టీలకు అతీతంగా అండగా నిలిచిన బోడంగిపర్తి గ్రామ ప్రజల అందరికీ పేరుపేరునా నరేష్ కుటుంబ సభ్యులు ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో కట్కూరి సత్తయ్య, వట్టికోటి శ్రీనివాస్, వరకాల శ్రవణ్, వర్కాల శంకరయ్య, కడారి నరసింహ, కట్కూరి నరసింహ, దోటి ఆంజనేయులు, కందికట్టె సైదులు, ఎండీ అఫ్జల్, వర్కాల అంబేద్కర్, బొమ్మరబోయిన వెంకట్, ఎండీ రాషద్, కుటుంబ సభ్యులు రేవల్లి శ్రీను రేవెల్లి మహేష్ తదితరులు పాల్గొన్నారు.