నల్లగొండ : స్వచ్ఛ మున్సిపాలిటీలే ధ్యేయంగా రాష్ట్ర ప్రభుత్వం పని చేస్తుందని దేవరకొండ ఎమ్మెల్యే రమావత్ రవీంద్ర కుమార్ అన్నారు. మంగళవారం దేవరకొండ పట్టణంలో రూ.42లక్షలతో కొనుగోలు చేసిన స్వీపింగ్ మిషన్ ను ఎమ్మెల్యే రవీంద్ర కుమార్ ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పట్టణాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తా అని ఆయన అన్నారు. పట్టణంలో పారిశుద్ధ్య నివారణకు ప్రత్యేక చర్యలు చేట్టామన్నారు. దేవరకొండ మున్సిపాలిటీని ఆదర్శవంతంగా తీర్చిదిద్దుతా అని ఆయన స్పష్టం చేశారు.
కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ అల్లంపల్లి నర్సింహ, ఎంపీపీ నల్లగసు జాన్ యాదవ్, జడ్పీటీసీ మారుపాకుల అరుణ, రైతు బంధు అధ్యక్షుడు శిరందాసు కృష్ణయ్య, వైస్ ఎంపీపీ చింతపల్లి సుభాష్ , టీఆర్ఎస్ మండల, పట్టణ అధ్యక్షులు TVN రెడ్డి, పున్న వెంకటేశ్వర్లు,TRS రాష్ట్ర నాయకులు హన్మంత్ వెంకటేష్ గౌడ్, వైస్ చైర్మన్ రహత్ అలీ,మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ పేర్వాల జాంగా రెడ్డి, టీఆర్ఎస్వీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు వేముల రాజు,TRSV నియోజకవర్గ అధ్యక్షుడు బొడ్డుపల్లి కృష్ణ, పొన్నబోయిన సైదులు, మూడవత్ జయప్రకాష్ నారాయణ, మహ్మద్ రైస్, తౌఫిక్ ఖాద్రి, ఇలియస్, బాబా, తదితరులు పాల్గొన్నారు.