సూర్యాపేట రూరల్, ఫిబ్రవరి 28 : సూర్యాపేట మున్సిపాలిటీ పరిధిలోని పిల్లలమర్రిలో మహా శివరాత్రి పర్వదినం సందర్భంగా నిర్వహించిన రథోత్సవం నేత్రపర్వంగా జరిగింది. శుక్రవారం తెల్లారుజామున మహాదేవ నామేశ్వర స్వామి దేవాలయం నుండి ఏరకేశ్వరస్వామి దేవాలయం వరకు గ్రామ పురవీధుల్లో స్వామి అమ్మవార్లను ఊరేగించారు. ముందుగా దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి సంప్రదాయ బద్దంగా స్వామి వార్ల ఉత్సవ విగ్రహాలను రథం పైకి తీసుకువచ్చారు.
డప్పుల చప్పుళ్ళు, డీజే సౌండ్ సందడితో మహిళలు కోలాటం ఆడుతూ రథసేవలో ఉత్సాహంగా పాల్గొన్నారు. ఆలయ అర్చకులు మునగలేటి సంతోష్ శర్మ సమక్షంలో జరిగిన ఈ కార్యక్రమంలో దేవాలయ కమిటి చైర్మన్ గవ్వ వెంకటకృష్ణరెడ్డి, డైరెక్టర్లు చిత్తలూరి సతీష్, చెరుకుపల్లి బుచ్చి రాములు, వల్లాల జానీ యాదవ్, నక్కల సైదులు, బట్టు నాగరాజు యాదవ్, చెరుకుపల్లి కృష్ణయ్య, మొగిలి ఎల్లయ్య, ఎర్రంశెట్టి వెంకటేష్, ఓబల్లోజు చంద్రశేఖర్, రాయల భారతమ్మ, చింత సునంద, షేక్ జానీ మియా పాల్గొన్నారు.