నీలగిరి, సెప్టెంబర్ 09 : రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన వంద రోజుల ప్రణాళిక కార్యక్రమం మంగళవారం ముగిసింది. ఈ సందర్భంగా నల్లగొండ పట్టణంలోని పలు ప్రాముఖ్యత కలిగిన ప్రాంతాల్లో శానిటేషన్ డ్రైవ్ను నిర్వహించారు. నల్లగొండ మున్సిపల్ సహాయ కమిషనర్ రవీందర్ రెడ్డి రాంనగర్ మున్సిపల్ పార్కులో చేపట్టిన శానిటేషన్ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వంద రోజుల ప్రణాళిక సందర్భంగా నల్లగొండ పట్టణంలో శానిటేషన్పై ప్రత్యేక దృష్టి సారించడం జరిగిందన్నారు. చిన్న, పెద్ద కాల్వల్లో కార్మికులతో కలిసి పూడికతీత పనులు చేపట్టినట్లు చెప్పారు. వన మహోత్సవ కార్యక్రమంలో చెట్లను నాటి వాటి సంరక్షణ కార్యక్రమాలు చేయడంతో పాటు ఇంటింటికి చెట్లను పంపిణీ చేసినట్లు వెల్లడించారు.
అనధికార భవనాలను గుర్తించి వాటికి అలైన్మెంట్లు చేసి భువన యాప్లో వివరాలు పొందుపరచడం జరిగిందన్నారు. అక్రమంగా ఉన్న ట్రేడ్ లైసెన్స్, నల్లాలను గుర్తించి వాటిని రెగ్యులర్ చేయడం జరిగిందని తెలిపారు. తడి, పొడి, హానికార చెత్తపై పట్టణ వాసులకు అవగాహన కల్పించినట్లు వెల్లడించారు. ఈ కార్యక్రమాలు నిరంతరం కొనసాగనున్నట్లు ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో శానిటరీ ఇన్స్పెక్టర్లు గడ్డం శ్రీనివాస్, నంద్యాల ప్రదీప్ రెడ్డి పాల్గొన్నారు.