తుంగతుర్తి, జూలై 02 : ఆర్యవైశ్య రాజకీయ కమిటీ రాష్ట్ర వైస్ ఛైర్మన్గా తుంగతుర్తి మండల పరిధిలోని బండరామారం గ్రామానికి చెందిన మాజీ ఎంపీపీ తాటికొండ సీతయ్య ఎన్నికయ్యారు. గురువారం హైదరాబాద్లోని ఆ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు అమరవాది లక్ష్మినారాయణ చేతుల మీదుగా నియామక పత్రం అందుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆర్యవైశ్య సంఘం బలోపేతం కోసం తన వంతు కృషి చేస్తానని తెలిపారు. తన ఎన్నికకు సహకరించిన ఆర్య వైశ్యులందరికి సీతయ్య కృతజ్ఞతలు తెలిపారు.