సీఎం కేసీఆర్తో దేశంలో సుస్థిర అభివృద్ధి స్వరాష్ట్రంలో ముఖ్యమంత్రి కేసీఆర్ వ్యవసాయం, విద్య, వైద్యం, ఉపాధి రంగాలకు ప్రాధాన్యం కల్పించారు. అన్ని వర్గాల మన్ననలు అందుకుంటూ అభివృద్ధి ప్రదాతగా నిలిచారు. పోరాడి సాధించుకున్న రాష్ర్టాన్ని బంగారు తెలంగాణ దిశగా తీసుకుపోతుండడంతో కేసీఆర్పై దేశ ప్రజల్లో విశ్వాసం పెరిగింది. కేసీఆర్ దేశ రాజకీయాల్లో వస్తే పెను మార్పులు చోటు చేసుకుంటాయి. జాతీయ రాజకీయాల్లో రాణిస్తే తెలంగాణ పథకాలు దేశ నలుమూలలకు విస్తరిస్తాయి.అన్ని రంగాల్లో ప్రక్షాళన కేసీఆర్తోనే సాధ్యమవుతుంది. దేశాన్ని రోల్ మాడల్గా తీర్చిదిద్దే సత్తా ఉన్న నాయకుడు ఆయన. తెలంగాణ నుంచి ఇలాంటి నేత జాతీయ రాజకీయాల్లో ఉండాలి. సమస్యలపై పూర్తి అవగాహన ఉన్న కేసీఆర్ దేశ రాజకీయాల్లో రాణించాలని ప్రజలు కోరుకుంటున్నారు. జాతీయ పార్టీ ఏర్పాటు ఆలోచన నిజంగా శుభ పరిణామం.
చరిత్రకు, వర్తమానానికి మధ్య విజ్ఞులైన వారధులు విశ్రాంత ఉద్యోగులు. ఎంతమంది పాలకులను చూసి ఉంటారు. ఎన్ని ప్రభుత్వాల్లో భాగస్వాములై పని చేసి ఉంటారు. దశాబ్దాల తరబడి ప్రజా జీవితంలో ఉన్నారు గనుకే సమాజ హితం, దేశ భవితవ్యం గురించి నిత్యం ఆలోచిస్తుంటారు. దేశ ఆర్థిక, సామాజిక, రాజకీయ పరిస్థితులను ఎప్పటికప్పుడు గమనిస్తూ చర్చకు పెడుతుంటారు. తమ అనుభవసారంతో మంచీచెడులను విశ్లేషించి సరైన మార్గనిర్దేశనం చేస్తుంటారు. ప్రస్తుతం మోదీ పాలనలో దేశంలో
నెలకొన్న సమస్యలు, వివక్ష పూరిత వైఖరుల నేపథ్యంలో.. ప్రత్యామ్నాయ రాజకీయ శక్తి అనివార్యమైన పరిస్థితుల్లో… ముఖ్యమంత్రి కేసీఆర్ జాతీయ రాజకీయాల్లోకి వెళ్తుండడాన్ని స్వాగతిస్తున్నారు. తెలంగాణ రాష్ట్రం సాధించి ఆరు దశాబ్దాల కలను నెరవేర్చిన యోధుడు కేసీఆర్తోనే భారత్ బంగారు తునక అవుతుందని ధీమాగా చెప్తున్నారు. దేశ స్థితిగతులపై పూర్తి అవగాహన ఉన్న కేసీఆర్ మాత్రమే తెలంగాణ మాడల్ అభివృద్ధిని అంతటా సాధ్యం చేయగలరని విశ్వసిస్తున్నారు. ఎనిమిదేండ్లలో తెలంగాణ సాధించిన వృద్ధి, ఉద్యోగులతోపాటు రిటైర్డ్ ఎంప్లాయీస్కు సర్కారు ఇస్తున్న ప్రాధాన్యం, అందిస్తున్న సంక్షేమంపై సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
తెలంగాణ ప్రత్యేక రాష్ట్రమే లక్ష్యంగా కేసీఆర్ అలుపెరుగని పోరాటం చేశారు. సబ్బండ వర్గాలను ఏకతాటిపైకి తీసుకొచ్చి రాష్ర్టాన్ని సాధించారు. సాధించిన
స్వరాష్ట్రంలో ప్రజల సంక్షేమమే ధ్యేయంగా పాలన సాగిస్తున్నారు. రాష్ర్టాన్ని బంగారు తెలంగాణగా తీర్చిదిద్దేందుకు తన వంతు కృషి చేస్తున్నారు. 24గంటల నిరంతర విద్యుత్, నీళ్లు పుష్కలంగా వస్తుండడంతో వ్యవసాయం పండుగలా మారింది. దేశానికే అన్నం పెట్టే స్థాయికి తెలంగాణ చేరుకున్నది. ఇక పెద్ద సంఖ్యలో పరిశ్రమలు ఏర్పాటవుతుండడంతో ఉపాధి అవకాశాలు పుష్కలంగా లభిస్తున్నాయి. పేద, మధ్య తరగతి వర్గాలకు పింఛన్లు, కల్యాణలక్ష్మి, కేసీఆర్ కిట్తోపాటు వృత్తిదారుల జీవనోపాధికి పలు పథకాలు అమలు చేస్తున్నారు. రైతు బంధు, దళిత బంధు పథకాలు ఆర్థిక పురోభివృద్ధికి బాటలు వేస్తున్నాయి. దేశంలో ఎక్కడా లేని విధంగా రాష్ట్ర అభివృద్ధి, సంక్షేమ పథకాలు మన దగ్గరే ఉన్నాయి. కేసీఆర్ దేశ రాజకీయాల్లోకి వెళ్తే అన్ని వర్గాల ప్రజలకు తెలంగాణ మాదిరిగా లబ్ధి చేకూరనున్నదని రిటైర్డ్ ఉద్యోగులు అంటున్నారు. కేసీఆర్ జాతీయ పార్టీ ఏర్పాటు చేసి కీలకపాత్ర వహిస్తే దేశంలో ఎన్నో మార్పులు చోటు చేసుకునే అవకాశాలుంటాయని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.
తెలంగాణ వస్తుందో లేదో అని అందరూ నిరాశ, నిస్పృహలకు లోనయ్యారు. ఆ సమయంలో తెలంగాణ ప్రజల ఆశాకిరణంగా కేసీఆర్ ఉద్యమ సారథిగా బాధ్యతలు చేపట్టారు. అలుపెరుగని పోరాటంచేసి సబ్బండ వర్గాలను ఏకీకృతం చేసి తెలంగాణ రాష్ర్టాన్ని సాధించారు. రాష్ర్టాన్ని బంగారు తెలంగాణగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తున్నారు. సీఎం కేసీఆర్ దేశాన్ని తెలంగాణ రాష్ట్రం మాదిరిగా అభివృద్ధి పరిచేందుకు సరైన సమయంలో జాతీయ రాజకీయాల్లోకి రావడం శుభ పరిణామం. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ధరలను విపరీతంగా పెంచి ప్రజలపై ఎనలేని భారాన్ని మోపింది. నిత్యావసర ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. సగం జీతం వాటికే సరిపోతుంది. కేంద్రం ప్రభుత్వం వల్లే ప్రజలకు కష్టాలు ఎదురవుతున్నాయి. సీఎం కేసీఆర్ దేశ రాజకీయాల్లోకి వెళ్తే అన్ని వర్గాల ప్రజలకు మేలు జరిగే అవకాశం ఉన్నది.
– నిమ్మల పిచ్చయ్య, రిటైర్డ్ అసిస్టెంట్ డైరెక్టర్, పాఠశాల విద్యాశాఖ(నల్లగొండ రూరల్)
సీఎం కేసీఆర్ కేంద్రంలో ఉంటే రైతులకు స్వర్ణ యుగమే
ముఖ్యమంత్రి కేసీఆర్ జాతీయ రాజకీయాల్లోకి అడుగు పెట్టి కీలక పాత్ర పోషించాలి. కేంద్రంలో పాలనా పగ్గాలు చేపడితే దేశంలోని రైతులకు ఒక స్వర్ణ యుగమే అవుతుంది. ఉమ్మడి రాష్ట్రంలో సాగునీరు లేక పంటలు పండక రైతులు ఆత్మహత్యలు చేసుకునే వారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు తర్వాత సీఎం కేసీఆర్ రైతుల సంక్షేమానికి అనేక పథకాలు తీసుకొచ్చారు. 24 గంటల ఉచిత విద్యుత్ అందించడంతోపాటు సాగునీటి ప్రాజెక్టులు పూర్తి చేయడంతో దేశానికే ఆదర్శంగా ధాన్యం ఉత్పత్తి పెరిగింది. ప్రస్తుతం దేశంలో పెట్రోల్, గ్యాస్ ధరల పెంపుతో ప్రజలపై మోయలేని భారం పడుతున్నది. రైతులకు ఉచిత కరెంటు ఇవ్వక పోగా పంపుసెట్లకు మీటర్లు పెట్టే ఆలోచనలో కేంద్ర ప్రభుత్వం ఉన్నట్లు తెలుస్తున్నది. ఇలాంటి తరుణంలో కేంద్రంలో ప్రత్యామ్నాయంగా కేసీఆర్ వంటి నాయకుడు రావాల్సిన అవసరం ఉన్నది. కేసీఆర్ దేశ రాజకీయాల్లో ఉంటే అభివృద్ధి పరుగులు పెట్టడమే కాకుండా ప్రజలకు అన్ని విధాలా మేలు జరిగే అవకాశం ఉంటుంది.
– వనపర్తి సోమయ్య, రిటైర్డ్ టీచర్, తక్కెళ్లపహాడ్ (మిర్యాలగూడ రూరల్)
దేశానికి ఆదర్శంగా తెలంగాణ పథకాలు
పోరాడి సాధించుకున్న తెలంగాణను సీఎం కేసీఆర్ అన్ని విధాలా అభివృద్ధి చేస్తున్నారు. దళిత బంధు, రైతు బంధు, రైతు బీమా, కల్యాణలక్ష్మి, ఉచిత కరెంటు, ఉద్యోగులకు 30 శాతం డీఎ పెంపు ఇలా అన్ని వర్గాలకు మేలు చేస్తున్నారు. రాష్ట్ర అభివృద్ధి ప్రదాత సీఎం కేసీఆర్తోనే దేశ రాజకీయాల్లో మార్పు వస్తుందని ఆశిస్తున్నాం. ఎనిమిదేండ్లలో రాష్ట్రంలో విద్యా వ్యవస్థను బలోపేతం చేశారు. ఇంగ్లిష్ మీడియం ప్రవేశపెట్టి సన్నబియ్యంతోపాటు భోజనం అందిస్తున్నారు. గురుకులాల ఏర్పాటుతో పేద విద్యార్థులకు కార్పొరేట్ స్థాయిలో విద్య అందుతున్నది. వివిధ వర్గాలకు పింఛన్లు, సంక్షేమ ఫలాలు అందుతుండడంతో సంతోషంగా ఉన్నారు. పల్లె, పట్టణాల్లో పార్కుల ఏర్పాటుతో సుందరంగా మారాయి. సీఎం కేసీఆర్ జాతీయ రాజకీయాల్లోకి వెళ్తే రాష్ట్రంలో చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలు దేశ వ్యాప్తంగా అమలయ్యే అవకాశం ఉంటుంది.
– యడవల్లి నాగేశ్వర్రావు, రిటైర్డ్ హెచ్ఎం (అడవిదేవులపల్లి)
సీఎం కేసీఆర్తోనే దేశాభివృద్ధి
ప్రస్తుత దేశ రాజకీయాల్లో మార్పులు తప్పనిసరి అవసరమనిపిస్తున్నది. కేసీఆర్ జాతీయ పార్టీ పెట్టి దేశంలో కీలక పాత్ర పోషించాలి. కేసీఆర్తోనే ప్రజల ఆకాంక్షకు అనుగుణంగా పాలన అందుతుందని ప్రజలు నమ్ముతున్నారు. తన పోరాట పటిమ, వాక్ చాతుర్యంతో అన్ని వర్గాల ప్రజలను ఏకతాటిపైకి తీసుకొచ్చి తెలంగాణ రాష్ర్టాన్ని సాధించిన నేత కేసీఆర్. కాళేశ్వరం, తదితర ప్రాజెక్టులు చేపట్టి రాష్ట్రంలో వ్యవసాయాన్ని పండుగలా చేయగా.. అన్ని వృత్తిదారుల జీవనోపాధికి పథకాలు అమలు చేస్తున్నారు. వృద్ధులు, దివ్యాంగులు, వితంతువులు ఇలా ప్రతి ఒక్కరికీ పింఛన్లు అందుతున్నాయి. కేసీఆర్ నాయకత్వం దేశానికి ప్రస్తుతం ఎంతో అవసరం. కేంద్రంలో తెలంగాణ నుంచి సరైన నాయకుడు లేకపోవడంతో మనకు దక్కాల్సిన నిధులు రావడం లేదు. మన నాయకుడు దేశ రాజకీయాల్లో ఉంటే రాష్ట్రం అన్ని విధాలా అభివృద్ధి చెందుతుంది.
-అంకం చంద్రమౌళి, రిటైర్డ్ టీచర్ (దేవరకొండ)
స్వర్ణభారత్ కేసీఆర్తోనే సాధ్యం
తెలంగాణ రాష్ర్టాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్ జాతీయ రాజకీయాల్లోకి వచ్చినట్లయితే స్వర్ణభారత్ను సాధించుకోవచ్చు. రైతులు, ఉద్యోగులు, సకల జనుల సమస్యలపై పూర్తి అవగాహన కలిగిన కేసీఆర్ దేశానికి ఎంతైనా అవసరం. ఆర్కిటెక్ట్గా యాదాద్రి ఆలయ నిర్మాణం, ఇంజినీర్గా కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం కేసీఆర్ సామర్థ్యానికి నిదర్శనాలు. అలాంటి నాయకుడు జాతీయ రాజకీయాల్లోకి వచ్చిన్నట్లయితే మా వంతు సహాయ, సహకారాలు అందిస్తాం. ప్రస్తుతం దేశ సమస్యలపై కేంద్ర వైఖరిని ప్రశ్నించి, ఖండించే ధైర్యం ఉన్న నాయకుడు కేసీఆర్ మాత్రమే. ప్రజలకు నష్టం కలిగించే కేంద్ర విద్యుత్ విధానంపై పోరాటం చేయాల్సిన అవసరం ఉన్నదని అసెంబ్లీలో ప్రస్తావించడం, అన్ని పార్టీల నాయకులను కలుపుకొని పోవడం కేసీఆర్కే సాధ్యం.
-వేనేపల్లి శ్రీనివాస్రావు, విశ్రాంత వ్యాయామ అధ్యాపకుడు (కోదాడ రూరల్ )
స్వరాష్ట్రంలో సంతోషంగా విశ్రాంత ఉద్యోగులు
ఉమ్మడి రాష్ట్రంతో పోల్చుకుంటే పోరాడి సాధించుకున్న తెలంగాణలో అన్ని వర్గాల ప్రజలు సంతోషంగా ఉన్నారు. ఉద్యోగ, ఉపాధ్యాయులతో పాటు రిటైర్డ్ ఉద్యోగులు హ్యాప్పీగా ఉన్నారు. ఉద్యోగులకు రికార్డు స్థాయిలో పీఆర్సీ, ఇంక్రిమెంట్ ఇవ్వడంతో వేతనాలు ఆశించిన స్థాయిలో పెరిగాయి. పెన్షనర్లకూ అదే విధంగా పెరిగాయి. తెలంగాణ వచ్చే నాటికి గ్రాట్యుటీ రూ.8 లక్షలు ఉండగా నేడు రిటైర్ అయ్యే ఉద్యోగికి రూ.16 లక్షలు వస్తున్నాయి. నెలనెలా ఇచ్చే మెడికల్ అలవెన్స్ పెరిగింది. ఉద్యోగి చనిపోతే దహన సంస్కారాలకు గతంలో రూ.10వేలు ఇవ్వగా నేడు రూ.20వేలకు పెరిగింది.
కేసీఆర్ పాలనలో ఉద్యోగులకు భద్రత
కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వ సంస్థలను నిర్వీర్యం చేస్తున్నది. ప్రైవేటు కంపెనీలకు కట్టబెడుతూ ప్రజలకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లేకుండా చేస్తున్నది. కేంద్ర ప్రభుత్వ విధానాల వల్ల ప్రభుత్వ ఉద్యోగులకూ భద్రత లేకుండా పోయింది. ముఖ్యమంత్రి కేసీఆర్ జాతీయ రాజకీయాల్లోకి వెళ్తే ప్రభుత్వ సంస్థలను నిర్వీర్యం చేసేలా ఆలోచిస్తున్న కేంద్ర ప్రభుత్వ విధానాలకు అడ్డుకట్ట వేస్తారని విశ్వాసం ఏర్పడింది. ఎనిమిదేండ్లల్లో తెలంగాణ అన్ని రంగాల్లో అభివృద్ధి చెందడంతో దేశ మొత్తం రాష్ట్రం వైపు చూస్తున్నది. దేశ రాజకీయాల్లోకి సీఎం కేసీఆర్ వెళ్తే పెట్రోల్, గ్యాస్ ధరలకు అడ్డుకట్ట వేయడంతోపాటు ప్రజలపై పన్నుల భారం పడకుండా చూసే అవకాశం ఉన్నదని రిటైర్డ్ ఉద్యోగులు పేర్కొంటున్నారు.
కేసీఆర్ దేశ రాజకీయాల్లో కచ్చితంగా రాణిస్తారు
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఎమ్మెల్యేగా, మంత్రిగా, ఎంపీగా, కేంద్ర మంత్రిగా.. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా కేసీఆర్కు సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉంది. అసలు రానే రాదనుకున్న తెలంగాణ ప్రత్యేక రాష్ట్రాన్ని తీసుకొచ్చి ప్రజల కలలను సాకారం చేశారు. తెలంగాణ ఉద్యమాన్ని ఉవ్వెత్తున లేపి సకల జనులను భాగస్వాములను చేయడంలో ఆయన కృషి ఎనలేనిది. కుల మతాలు, రాజకీయాలకు అతీతంగా రాష్ట్రంలో సంక్షేమ పాలన అందిస్తున్న ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్దే. ప్రస్తుతం దేశం చూపు తెలంగాణ రాష్ట్రం వైపు ఉందంటే అది కేసీఆర్ వల్లనే. కేసీఆర్ వంటి ముఖ్యమంత్రి మాకూ కావాలని దేశ ప్రజలు కోరుకుంటున్నారు. దేశ రాజకీయాల్లో కేసీఆర్ రాణిస్తానడంలో ఎలాంటి సందేహం లేదు.
– నీలకంఠ చలమంద, రిటైర్డ్ హెడ్ మాస్టర్, సూర్యాపేట(బొడ్రాయిబజార్)
ప్రధాన పార్టీలను ఎదుర్కొనే ధైర్యం కేసీఆర్కే ఉంది
జాతీయ స్థాయిలో ప్రధాన పార్టీల పాలనలో ప్రజలు విసుగు చెందారు. వాటికి ప్రత్యామ్నాంగా ఇతర నాయకులు రావాల్సి ఉన్నది. తెలంగాణలో అనేక అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తున్న కేసీఆర్తోనే అది సాధ్యమవుతుంది. పట్టుబడితే సాధించే వరకూ విశ్రమించని నేత కేసీఆర్. ఆయనకు ఉన్న దమ్ము, ధైర్యం దేశం రాజకీయాల్లో ఎవరికీ లేవు. అపర భగీరథుడిగా, రైతుల పాలిట దైవంగా మారిన కేసీఆర్ దేశానికి ఎంతో అవసరం. సర్వీసు పెన్షర్ల జీతాలు ఇతర రాష్ర్టాల కంటే మెరుగుగా ఏర్పాటు చేసిన ఘనత కేసీఆర్దే. ఆయనకు ప్రజలు ఎప్పుడూ అండగా ఉంటారు.
– పసల మరియదాసు, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ రిటైర్డ్ ఉద్యోగుల సంఘం నకిరేకల్ శాఖ అధ్యక్షుడు
కేసీఆర్ దేశానికి నాయకత్వం వహించాలి
తెలంగాణ రాష్ర్టాన్ని దేశంలోనే తిరుగులేని శక్తిగా తయారు చేసిన సీఎం కేసీఆర్ దేశ రాజకీయాల్లోకి వెళ్లాల్సిన అవసరమున్నది. ఇందుకోసం యావత్ దేశ ప్రజానీకం ఎదురు చూస్తున్నది. వ్యవసాయం, విద్య వైద్య రంగాల్లో పెను మార్పులు తీసుకొచ్చిన కేసీఆర్ దేశ రాజకీయాల్లోకి వెళ్లడాన్ని ప్రతి ఒక్కరూ స్వాగతిస్తున్నారు. దేశంలో ధరల భారం సామాన్యుడు మోయలేక పోతున్నాడు. ఇలాంటి పరిస్థితుల్లో జాతీయ రాజకీయాల్లోకి సమర్థులు రావడం అనేది అనివార్యం. ఎన్నో ఆశలు పెట్టుకున్న దేశ ప్రజలను కేంద్ర ప్రభుత్వం ఇబ్బందులకు గురిచేస్తున్నది. అధిక ధరలు, జీఎస్టీ, ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేట్పరం చేయడంలాంటి వాటితో ప్రజలు విసిగిపోయారు. కేసీఆర్ జాతీయ రాజకీయాల్లోకి వస్తే దేశం అభివృద్ధి పథంలో దూసుకుపోతుంది. ప్రపంచంలో నంబర్వన్గా మారుతుంది. రిటైర్డ్ ఉద్యోగులకు పీఆర్సీ పెంచి ఆదుకున్న దేవుడు కేసీఆర్.
-మన్మోహన్, రిటైర్డ్ కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్ (నల్లగొండ సిటీ)
సీఎం కేసీఆర్తోనే ఉద్యోగులకు భద్రత
తెలంగాణ రాష్ట్రంలో ఉద్యోగులు, పింఛన్దారులకు ఉద్యోగ భద్రత ఉన్నది. కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వ సంస్థలను నిర్వీర్యం చేసేలా వ్యవహరిస్తున్నది. ఉద్యోగులకు భద్రత లేకుండా పోయింది. ముఖ్యమంత్రి కేసీఆర్ జాతీయ రాజకీయాల్లోకి వెళ్తే ప్రభుత్వ సంస్థలను నిర్వీర్యం చేసేలా ఆలోచిస్తున్న కేంద్ర ప్రభుత్వ విధానాలకు అడ్డుకట్ట పడుతుంది. రాష్ట్రంలో అమలవుతున్న సంక్షేమ పథకాలు ఆటంకం లేకుండా కొనసాగుతాయి. తెలంగాణ రాష్ట్రంలో ఉద్యోగులు, రిటైర్డు ఉద్యోగులకు అమలు అవుతున్న వేతనాలు, సంక్షేమ పథకాలు ఇతర రాష్ర్టాల వారు కోరుకుంటున్నారంటే ఇక్కడ ప్రత్యేకత ఏమిటో తెలుస్తుంది. దేశ రాజకీయాల్లో కేసీఆర్ వెళ్తే నిరంతర విద్యుత్ కోసం మరిన్ని ప్రాజెక్టుల నిర్మాణాలు జరిగే అవకాశం ఉంది. ఉద్యోగులకు భద్రతతోపాటు యువతకు ఉద్యోగ అవకాశాలు పెరుగుతాయి.
– వి.నాగరాజు, జెన్కో రిటైర్డ్ ఉద్యోగి, (నందికొండ)