మునుగోడు, జనవరి 9 : ప్రభుత్వం పేదల కోసం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డి అన్నారు. మండల కేంద్రంలో క్యాంప్ కార్యాలయంలో పలు గ్రామాల లబ్ధిదారులకు మంజూరైన కల్యాణ లక్ష్మి చెక్కులను పంపిణీ మంగళవారం చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రజల వద్దకే ప్రజాపాలన తీసుకురావడానికి కాంగ్రెస్ ప్రభు త్వం కృషి చేస్తున్నదన్నారు. ప్రతి నెలా మంజూరైన కల్యాణ లక్ష్మి చెక్కులు వెంటనే లబ్ధిదారులకు అంద జేయాలని అధికారులను ఆదేశించారు. తన కోసం చెక్కులు నిలుపవద్దని, అధికారులు లబ్ధిదారులకు గ్రామాలకు వెళ్లి పంపిణీ చేయాలన్నారు. కార్యక్రమంలో తాసీల్దార్ నరేందర్, డీటీ నరేశ్, పీఏసీఎస్ చైర్మన్ కుంభం శ్రీనివాస్రెడ్డి, సర్పంచులు, ఎంపీటీసీలు పాల్గొన్నారు.
ఇరిగేషన్ అధికారులతో ఎమ్మెల్యే సమీక్ష
మునుగోడు నియోజకవర్గ ఇరిగేషన్ అధికారులు, ఆయా గ్రామాల ముఖ్య నాయకులు, భూనిర్వాసితులతో ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డి మంగళవారం సమీక్షా సమావేశం నిర్వహించారు. చర్లగూడెం, కిష్టిరాంపల్లి ప్రాజెక్టులకు సంబంధించిన పనుల పురోగతి గురించి అధికారులతో చర్చించారు. ఆయా ప్రాజెక్టుల కింద భూములు కోల్పోయిన నిర్వాసితులకు ఇప్పటివరకు ఎంత ప్యాకేజీ విషయాలను చర్చించారు. ఇక్కడ భూములు కోల్పోయిన భూ నిర్వాసితులకు మల్లన్న సాగర్ రిజర్వాయర్ కింద భూములు కోల్పోయిన వారికి రూ,9,00,000 వరకు అందించే విధంగా చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యేను కోరారు. అలాగే మైనర్ ఇరిగేషన్ ప్రాజెక్టులైన బునాది కాల్వ,శేషులేటివాగు,వెల్మకన్నె ఫీడర్ ఛానల్లకు సంబంధించిన పనులపై యాక్షన్ప్లాన్ రూపొందించాలని అధికారులను ఆదేశించారు. సమావేశంలో ఇరిగేషన్ శాఖకు సంబంధించిన ఎస్ఈతో పాటు డీఈలు, ఈఈలు,ఏఈలు పాల్గొన్నారు.