నల్లగొండ : రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన పోలీస్ ఉద్యోగాల భర్తీలో భాగంగా పోలీస్ శాఖ తరుపున డి.జి.పి మహేందర్ రెడ్డి ఆదేశాల మేరకు ఎస్.ఐ, కానిస్టేబుల్ ఉద్యోగాలకు పోటీ పడే అభ్యర్థులకు 30 రోజుల పాటు భోజన, వసతితో కూడిన ఇండోర్, ఔట్ డోర్ ఉచిత శిక్షణా ఇవ్వనున్నట్లు జిల్లా ఎస్పీ రేమా రాజేశ్వరి తెలిపారు.
ఈ సందర్బంగా మాట్లాడుతూ.. ఈ నెల తేదీ 28, 29 రోజులలో ఉదయం 6.00 గంటలకు మేకల అభినవ స్టేడియం నందు మొదట పిజికల్ స్క్రీనింగ్ టెస్ట్ నిర్వహించి అనంతరం 31.03.2022 రోజున యన్.జి కళాశాలో రాత పరీక్ష నిర్వహిస్తారన్నారు. ఎన్నికైన అభ్యర్థులకు 06.04.2022 నుంచిడి జిల్లా పోలీస్ శిక్షణ కేంద్రంలో శిక్షణ తరగతులు నిర్వహిస్తారని తెలిపారు. అభ్యర్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని పోలీస్ ఉద్యోగాలు సాధించాలని ఎస్పీ తెలిపారు.
అభ్యర్థులు గమనించవలిసిన విషయాలు..
మేకల అభినవ స్టేడియంలో ఉదయం 6 గంటలకు ఫిజికల్ టెస్టులు నిర్వహించనున్నారు. దీనిలో భాగంగా పోటీలో పాల్గొనే పురుష అభ్యర్థులకు మొదటగా ఎత్తు, 800 మీటర్ల పరుగు పందెం నిర్వహిస్తారు. మహిళా అభ్యర్థులకు 100 మీటర్ల పరుగు పందెం నిర్వహిస్తారు. అభ్యర్థులు తమ వెంట సర్టిఫికెట్స్ జిరాక్స్ సెట్ తీసుకరావాలని నిర్వాహకులు సూచించారు.