హాలియా, జనవరి 5 : జాతీయ స్థాయి కబడ్డీ పోటీలకు హాలియాలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు చెందిన తగుళ్ల కార్తీక్ ఎంపికైనట్లు పాఠశాల ప్రధానోపాధ్యాయుడు గుండా కృష్ణమూర్తి, పీడీ కోడుమూరి వెంకట్రాంరెడ్డి శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు.
67వ స్కూల్ గేమ్స్ ఫెడరేషన్లో భాగంగా ఈ నెల 7 నుంచి 11 వరకు కామారెడ్డిలో జరుగనున్న జాతీయ స్థాయి కబడ్డీ పోటీలకు అండన్-17 బాలుర విభాగంలో కార్తీక్ ఎంపికైనట్లు పేర్కొన్నారు. ప్రతిభ కనబర్చిన విద్యార్థిని ఉపాధ్యాయులు, విద్యార్థులు అభినందించారు.