గ్రామీణ ప్రాంత ప్రజలకు 24గంటలు నాణ్యమైన వైద్య సేవలు అందించడమే తమ ధ్యేయమని ప్రభుత్వ విప్ గొంగిడి సునీతామహేందర్రెడ్డి అన్నారు. వర్చుస సంస్థ, యునైటైడ్ ఆఫ్ హైదరాబాద్ కంపెనీ సహకారంతో మోటకొండూర్ పీహెచ్సీలో ఏర్పాటుచేసిన 30 పడకల దవాఖానను కలెక్టర్ పమేలాసత్పతితో కలిసి బుధవారం ఆమె ప్రారంభించారు. కార్పొరేట్కు దీటుగా ప్రభుత్వ దవాఖానలు తీర్చిద్దుతున్నామని, ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
మోటకొండూర్, జూలై 20 : గ్రామీణ ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించడమే తమ లక్ష్యమని, మోటకొండూర్ పీహెచ్సీలో మండల ప్రజలకు 24 గంటల వైద్య సేవలు అందించేందుకు కృషి చేస్తామని ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే గొంగిడి సునీతామహేందర్రెడ్డి అన్నారు. బుధవారం మోటకొండూర్ మండల కేంద్రంలోని పీహెచ్సీలో వర్చుస, యునైటెడ్ వే ఆఫ్ హైదరాబాద్ సంస్థల సహకారంతో ఏర్పాటు చేసిన 30 పడకల దవాఖానను కలెక్టర్ పమేలా సత్పతి, అదనపు కలెక్టర్ దీపక్ తివారీ, వర్చుస సీఎఫ్ఓ అమిత్ బజోరియా, యునైటెడ్ వే ఆఫ్ హైదరాబాద్ సీఈఓ రేఖాశ్రీనివాసన్తో కలిసి జ్యోతి వెలిగించి దవాఖానను ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్రభుత్వ విప్ మట్లాడుతూ.. నియోజకవర్గ ప్రజల ఇబ్బందులను గుర్తించి ఆలేరులో సొంత ఖర్చుతో డయాలసిస్ సెంటర్, అదే తరహాలో వర్చుస, యునైటెడ్ వే ఆఫ్ హైదరాబాద్ సంస్థల సహకారంతో మోటకొండూర్ పీహెచ్సీలో 30 పడకల దవాఖాన ఏర్పాటు చేయించినట్లు తెలిపారు. కార్పొరేట్ ఆస్పత్రులకు దీటుగా ప్రభుత్వ ఆస్పత్రుల్లో ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకే పీహెచ్సీలో 30 పడకల దవాఖానను ఏర్పాటు చేయించామన్నారు.
వర్చుస, యునైటెడ్ వే ఆఫ్ హైదరాబాద్ సంస్థల ఆధ్వర్యంలో 30 పడకల దవాఖానను సుమారు రూ.1.50 కోట్లతో ఏర్పాటు చేయడం గొప్ప విషయమన్నారు. ఈ దవాఖానను మండల ప్రజలు వినియోగించుకోవాలన్నారు. సర్పంచ్ వడ్డెబోయిన శ్రీలత మాట్లాడుతూ.. ప్రభుత్వ విప్ కృషితోనే 30 పడకల దవాఖాన నిర్మాణం సాధ్యమైందని, ఏర్పాటుకు సహకరించిన ఆయా సంస్థల సభ్యులకు ధన్యవాదాలు తెలిపారు. వర్చుస సీఎఫ్ఓ అమిత్ బజోరియా మాట్లాడుతూ.. మోటకొండూర్లో దవాఖాన ఏర్పాటు చేయడం సంతోషంగా ఉందన్నారు. భవిష్యత్లో మరిన్ని సేవ కార్యక్రమాలు చేపడుతామన్నారు. యునైటెడ్ వే ఆఫ్ హైదరాబాద్ సీఈఓ రేఖాశ్రీనివాసన్ మాట్లాడుతూ.. కరోనా విపత్కర పరిస్థితుల్లో ఎన్నో సమస్యలను గుర్తించామని, అందరి సహకారంతోనే నూతనంగా దవాఖాన ఏర్పాటు చేశామన్నారు. అనంతరం ఆయా సంస్థల సభ్యులను ప్రభుత్వ విప్ గొంగిడి సునీత, సర్పంచ్ శ్రీలత ఆధ్వర్యంలో సన్మానించి మెమెంటోలు అందజేశారు. అంతకు ముందు పీహెచ్సీ ఆవరణలో మొక్కలు నాటారు.
కార్యక్రమంలో డీఎంహెచ్ఓ మల్లికార్జున్రావు, ఎంపీపీ పైళ్ల ఇందిరాసత్యనారాయణరెడ్డి, జడ్పీటీసీ పల్లా వెంకట్రెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ గడ్డమీది రవీందర్గౌడ్, మండల వైద్యాధికారి రాజేందర్నాయక్, ఎంపీడీఓ వీరస్వామి, తాసీల్దార్ జ్యోతి, వర్చుస లీడ్ మేనేజర్ కృష్ణన్, యునైటెడ్ వే ఆఫ్ హైదరాబాద్ వైస్ ప్రెసిడెంట్ భూషణ్రెడ్డి, ప్రోగ్రామ్ మేనేజర్లు రాములు, వెంకటరమేశ్, ఎంపీటీసీ పన్నాల అంజిరెడ్డి, ఉప సర్పంచ్ రేగు శ్రీనివాస్, వార్డు సభ్యులు, వివిధ పార్టీల నాయకులు పాల్గొన్నారు.
టీఆర్ఎస్ పార్టీ హ్యాట్రిక్ విజయం సాధించడం ఖాయం..
మోటకొండూరు : రాష్ట్ర పథకాలు దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నాయని, ఈ పథకాలతో రాబోయే ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ హ్యాట్రిక్ సాధించడం తథ్యమని ప్రభుత్వ విప్ గొంగిడి సునీతామహేందర్రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. బుధవారం మండల కేంద్రంలో టీఆర్ఎస్ ముఖ్య నాయకులతో సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. గ్రామ గ్రామాన టీఆర్ఎస్ బలోపేతానికి కృషి చేయాలని సూచించారు. ప్రభుత్వ పథకాలను ప్రజలకు చేరవేయాలన్నారు. అలాగే మండల కేంద్రంలోని జడ్పీహెచ్ఎస్ పాఠశాలలో నూతనంగా నిర్మించిన సైన్స్ ల్యాబ్ భవనాన్ని ఆమె ప్రారంభించారు. అనంతరం గ్రామ సర్పంచ్ వడ్డెబోయిన శ్రీలతతో కలిసి పాఠశాల ఆవరణలో మొక్కలు నాటారు. ఎంపీపీ పైళ్ల ఇందిరాసత్యనారాయణరెడ్డి, జడ్పీటీసీ పల్లా వెంకట్రెడ్డి, టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు బొట్ల యాదయ్య, వైస్ ఎంపీపీ ఇల్లెందుల మల్లేశ్గౌడ్, పీఏసీఎస్ వైస్ చైర్మన్ ఎగ్గిడి బాలయ్య, రైతు బంధు సమితి కన్వీనర్ అయిలయ్య, మార్కెట్ డైరెక్టర్ జంగారెడ్డి, ఎంపీటీసీ పన్నాల అంజిరెడ్డి, మండల కో ఆప్షన్ సభ్యుడు బురాన్, మాజీ మండలాధ్యక్షుడు దూదిపాల రవీందర్రెడ్డి, సర్పంచ్ల ఫోరం మండలాధ్యక్షుడు మంత్రి రాజు, టీఆర్ఎస్ యూత్ అధ్యక్షుడు బీస కృష్ణంరాజు, మహిళా అధ్యక్షురాలు బొలగాని నాగమణి, ఎస్సీ సెల్ అధ్యక్షుడు మహేశ్, సర్పంచులు, ఎంపీటీసీలు, నాయకులు పాల్గొన్నారు.