రామగిరి, ఏప్రిల్ 15 : శ్రీరామ నవమి వేడుకలను ఈ నెల 17న నిర్వహించనుండగా ఆలయాలను ముస్తాబు చేస్తున్నారు. సీతారాముల కల్యాణోత్సవానికి వేదికలను సిద్ధం చేస్తున్నారు.
ఇప్పటికే కొన్ని ఆలయాల్లో చలువ పందిళ్లతో విద్యుద్దీపాలతో అలంకరించారు. శ్రీరామ నవమి కోసం నల్లగొండలో సీతారామ, లక్ష్మణ, హనుమంతుని విగ్రహాలను తయారు చేసి విక్రయానికి రెడీగా ఉంచారు.