ఉట్నూర్ రూరల్, జనవరి 9: మండలంలోని లక్కారం గ్రామ పంచాయతీ పరిధిలోని వేణునగర్ గ్రామంలో గంజాయి విక్రయిస్తున్న వారిని ఎస్ఐ సుమన్ భరత్ సోమవారం పట్టుకున్నారు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామంలో పోలీసులు పెట్రోలింగ్ నిర్వహిస్తున్నారు. ఏడుగురు పాలిథిన్ కవర్లు పట్టుకొని ఉండగా.. పోలీసులను చూసి పారిపోయేందు కు ప్రయత్నించారు. వారిని వెంబడించి పట్టుకొని తనిఖీ చేయగా, గంజాయి బయటపడిం ది. వారిని విచారించగా ఏ1 కోవ్డెక పుల్ చంద్, ఏ2 నాంపెల్లి రామేశ్వర్, ఏ3 నాంపెల్లి జ్యోతి, ఏ4 గొల్ల ప్రీతమ్కుమార్, ఏ5 కోలా, ఏ6 టేకం రమేశ్గా గుర్తించారు.
వీరు గాదిగూడ మండలం కొలామ గ్రామానికి చెందిన ఏ1 రైతు తన వ్యవపాయ భూమిలో గతేడాది నుంచి అంతర పంటగా గంజాయి సాగుచేసూ విక్రయిస్తున్నారు. కిలో గంజాయి రూ.2 వేల చొప్పున విక్రయించారు. నిందితుల నుంచి మొత్తం 2.5 కిలోల గంజాయి, రూ.2 వేలు, 5 సెల్ఫోన్లు, రెండు బైకులు స్వాధీనం చేసుకొని వారిని రిమాండ్కు తరలించారు. నిందితులను పట్టుకున్న ఎస్ఐ సుమన్ భరత్, సిబ్బంది దా దారావ్, నాగన్న, కోండీబారావ్, లక్ష్మీనారాయణను ఎస్పీ అభినందించారు.
గుడిహత్నూర్, జనవరి 9 : గుడిహత్నూర్ మండలంలోని గర్కంపేట గ్రామానికి చెందిన సాయుధ దేవన్నకు గంజాయి కేసులో సోమవారం అదనపు జడ్జి మాధవి కృష్ణ మూడు సంవత్సరాల జైలు శిక్ష, రూ.5 వేల జరిమానా విధించినట్లు ఎస్ఐ ఎల్ ప్రవీణ్ తెలిపారు. 2020, జనవరి 9న సాయుధ దేవన్న గంజాయి తరలిస్తుండగా.. పోలీసుల తనిఖీలో అతని వద్ద 11 కిలోల గంజాయి లభించింది.
అప్పటి సీఐ శ్రీనివాస్ ఆదేశానుసారం ఏఎస్ఐ రహమాన్ఖాన్ కేసు నమోదు చేశారు. ప్రస్తుత విచారణ అధికారి, ఇచ్చోడ సీఐ ఎం నైలు నాయక్ ఆధ్వర్యంలో ఎస్ఐ ప్రవీణ్ కోర్టులో ప్రవేశ పెట్టగా.. అదనపు పబ్లిక్ ప్రాసిక్యూటర్ మధుకర్ ప్రవేశ పెట్టిన సాక్ష్యాధారాలను జడ్జి పరిశీలించారు. అతనికి మూడు సంవత్సరాల జైలు శిక్ష, రూ.5 వేల జరిమానా విధించారని ఎస్ఐ పేర్కొన్నారు.