శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలను గురువారం జిల్లా వ్యాప్తంగా ఘనంగా జరుపుకొన్నారు. చిన్ని కృష్ణుడు, రాధ, గోపికల వేషధారణలో చిన్నారులు అలరించారు. విద్యార్థులతో పలు స్కూళ్లలో వేడుకలను సంబురంగా నిర్వహించారు. ఆలయాలు, గ్రామ ప్రధాన కూడళ్లలో ఉట్టి కొట్టే కార్యక్రమాన్ని చేపట్టగా ప్రజలు ఉత్సాహంగా పాల్గొన్నారు. నల్లగొండ, మిర్యాలగూడ నకిరేకల్లో ఎంపీ బడుగుల లింగయ్యయాదవ్, ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య, హాలియాలో ఎమ్మెల్యే నోముల భగత్ పాల్గొన్నారు.
రామగిరి, సెప్టెంబర్ 7: శ్రీకృష్ణ జన్మాష్టమిని జిల్లా వ్యాప్తంగా గురువారం నిర్వహించుకున్నారు. ఈ సందర్భంగా ఊరూరా, పట్టణాల్లోని దేవాలయాలు, ప్రధాన కూడలిల్లో ఉట్లు కొట్టే కార్యక్రమం నిర్వహించారు. ఈ వేడుకను తిలకించేందుకు భక్తులు, ప్రజలు, ప్రజాప్రతినిధులు తరలిరావడంతో అంతాట సందడి కనిపించింది. నల్లగొండ జిల్లా కేంద్రంలోని కృష్ణ ఆలయంలో నిర్వహించిన కార్యక్రమంలో గొర్రెల, మేకల అభివృద్ధి సంస్థ చైర్మన్ దూదిమెట్ల బాలరాజుయాదవ్ హాజరై ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గోపాలుడిని నిష్టగా పూజిస్తే సకల బాధలు పోయి సంతోషం, సంపదలు పెరుతాయయని భక్తుల ప్రగాఢ విశ్వాసం.