కట్టంగూర్, మార్చి 7 : పాఠశాల పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలని కట్టంగూర్ సర్పంచ్ ముక్కామల శ్యామల శేఖర్ అన్నారు. ప్రజా పాలన- ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా శనివారం రెండో రోజు పాలకవర్గ సభ్యులు, ఉపాధ్యాయులు ఉన్నత పాఠశాల పరిసరాలు, వంటశాలను శుభ్రం చేసి చెత్తాచెదారం తొలగించారు. అనంతరం మధ్యాహ్న భోజనాన్ని పరిశీలించి విద్యార్థులతో మాట్లాడి వారితో కలిసి భోజనం చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మెనూ ప్రకారం విద్యార్థులుకు నాణ్యమైన భోజనం అందించాలని ఉపాధ్యాయులు, వంట కార్మికులకు సూచించారు. ఈ కార్యక్రమంలో ఎంఈఓ అంబటి అంజయ్య, పంచాయతీ కార్యదర్శి వడ్లకొండ అశోక్, ఉప సర్పంచ్ గుండు రాంబాబు, వార్డ సభ్యులు ఏకుల సుజాత, కల్లెం నాగేశ్వర్ రావ, అయితగోని సైదులు, ముషం రాణి, కానుగు సైదమ్మ, యర్కల శశి, సంధ్య, శ్రీను పాల్గొన్నారు.

పాఠశాల పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలి : సర్పంచ్ శ్యామల