తిరుమలగిరి (సాగర్), జనవరి 28 : మండలం కేంద్రానికి చెందిన వల్లవాయి సాయిఅభిజ్ఞ జాతీయ స్థాయి అండర్-14 కబడ్డీ బాలికల రాష్ట్ర జట్టుకు కెప్టెన్గా ఎంపికైంది. నల్లగొండలో 8వ తరగతి చదువుతున్న సాయిఅభిజ్ఞ కబడ్డీలో రాణిస్తూ జిల్లా, రాష్ట్ర స్థాయిలో తన ప్రతిభను చాటుతూ వస్తున్నది. ఈ నెల ఆంధ్రప్రదేశ్లోని కడప జిల్లా రాజవరంలో నిర్వహించే జాతీయ స్థాయి కబడ్డీ పోటీలకు ఆమె కెప్టెన్గా వ్యవహరించనున్నట్లు కోచ్లు ఉపేంద్ర, కాశీ తెలిపారు. సాయిఅభిజ్ఞ జాతీయ కబడ్డీ పోటీలకు ఎంపిక కావడం పట్ల తల్లిదండ్రులు, క్రీడాకారులు, గ్రామస్తులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.