దేవరకొండ, ఫిబ్రవరి 19 : నియోజకవర్గంలో బీటీ రోడ్ల నిర్మాణానికి ప్రభుత్వం గిరిజన శాఖ నుంచి రూ. 27.05 కోట్ల నిధులు మంజూరు చేసినట్లు ఎమ్మెల్యే రమావత్ రవీంద్రకుమార్ తెలిపారు. ఆదివారం ఎమ్మెల్యే దేవరకొండలోని తన క్యాంపు కార్యాలయంలో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. గతంలో రూ. 33 కోట్ల నిధులు గిరిజన శాఖ నుంచి మంజూరైనట్లు చెప్పారు. ప్రస్తుతం మంజూరైన నిధుల్లో దేవరకొండకు రూ. 6.24 కోట్లు, చందంపేట మండలానికి రూ.12.24 కోట్లు, నేరేడుగొమ్ము మండలానికి రూ. 3.90 కోట్లు, చింతపల్లికి రూ. 1.17 కోట్లు, కొండమల్లేపల్లికి రూ. 3.14 కోట్ల నిధులను ప్రభుత్వం మంజూరు చేసినట్లు పేర్కొన్నారు. రానున్న ఆరు నెలల్లో రహదారులన్నీ బీటీ రోడ్లు కానున్నట్లు చెప్పారు. గతంలో మంజూరైన రహదారుల్లో కొన్నింటికి టెండర్ల్లు పూర్తికాగా మరికొన్ని పనులు ప్రారంభమైనట్లు ఎమ్మెల్యే తెలిపారు. సమావేశంలో మున్సిపల్ చైర్మన్ ఆలంపల్లి నర్సింహ, ఎంపీపీ నల్లగాసు జాన్యాదవ్, జడ్పీటీసీ అరుణాసురేశ్గౌడ్, వైస్ ఎంపీపీ చింతపల్లి సుభాశ్గౌడ్, వైస్ చైర్మన్ రహత్ అలీ, సర్పంచుల ఫోరం చందంపేట మండలాధ్యక్షుడు మల్లారెడ్డి, బీఆర్ఎస్ నాయకులు సురేశ్గౌడ్, బొడ్డుపల్లి కృష్ణ పాల్గొన్నారు.