నల్లగొండ రూరల్, మే 20 : యాదవలు, కురుమలను, యాదవుల కుల వృత్తిని కిచంపరుస్తూ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్పై అనుచిత వ్యాఖ్యలు చేసిన టీపీసీసీ అధ్యక్షుడు రెవంత్రెడ్డి వెంటనే క్షమాపణ చెప్పాలని నాగార్జున సాగర్ ఎమ్మెల్యే నోముల భగత్కుమార్ డిమాండ్ చేశారు. నల్లగొండ జిల్లా కేంద్రంలో యాదవ, కురుమల జేఏసీ ఆధ్వర్యంలో శనివారం నిరసన ర్యాలీ, ధర్నా నిర్వహించారు. అనంతరం రేవంత్రెడ్డి దిష్టిబొమ్మను సదర్ దున్న రాజులతో తొక్కించి దహనం చేశారు.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఎమ్మెల్యే భగత్ మాట్లాడుతూ గత ప్రభుత్వాలు కుల వృత్తులను పట్టించుకోలేదని, కుల వృత్తులకు ఊతమిచ్చిన ఏకైక ప్రభుత్వం తమదేనని అన్నారు. యాదవులు, కురుమలకు గొర్రెలు.. మత్స్య, ముదిరాజ్ కులాలకు చేపల పంపిణీ చేసి ఆదుకున్నారని తెలిపారు. దాంతో మాంసం ఉత్పత్తిలో, మత్స్య సంపదలో తెలంగాణ రాష్ట్రం దేశంలోనే అగ్రగామిగా నిలిచిందని తెలిపారు. కుల వృత్తులపై ఆధారపడిన బలహీన వర్గాలను ఆదుకునేందుకు సీఎం కేసీఆర్ ఇటీవల నిర్ణయం తీసుకున్నారన్నారు.
మంత్రి శ్రీనివాస్ యాదవ్పై రేవంత్రెడ్డి అనుచిత వ్యాఖ్యలు చేయడంతోపాటు యాదవులను, యాదవ కుల వృత్తిని అవమానించేలా మాట్లాడడాన్ని ఖండిస్తున్నామని తెలిపారు. యాదవులపై చేసిన అనుచిత వ్యాఖ్యలకు ఈ నెల 24లోపు రేవంత్రెడ్డి క్షమాపణ చెప్పకుంటే 25న గాంధీభవన్ ముట్టడిస్తామని హెచ్చరించారు. యాదవ, కురుమల జేఏసీ రాష్ట్ర నాయకుడు డి.రాజారాం యాదవ్ మాట్లాడుతూ రేవంత్రెడ్డి క్షమాపణ చెప్పకుండా రాష్ట్రంలో ఎక్కడ తిరిగినా పెండ విసురడం తప్పదన్నారు.
జేఏసీ రాష్ట్ర కన్వీనర్ కడారి ఆంజయ్య యాదవ్ మాట్లాడుతూ రేవంత్రెడ్డిపై రాష్ట్ర వ్యాప్తంగా యాదవులు, కురుమలు ఆగ్రహంతో ఉన్నారన్నారు. యాదవ, కురుమల జేఏసీ రాష్ట్ర కో కన్వీనర్ లొడంగి గోవర్ధన్ యాదవ్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో జేఏసీ నాయకులు సోమనబోయిన సుధాకర్, నూక కిరణ్, సాదం సంపత్, చీర పంకజ్, అయోధ్య, ఏడుకొండల్, అశోక్, శ్రీశైలం, వెంకటేశం, బాలరాజు, చందు, వంశీ, మామిడి పద్మ, జానయ్య, శ్రీనివాస్, శివకుమార్, తసతీశ్, సైదులు, శ్రీనివాస్ పాల్గొన్నారు.
రెండోవది.. టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి దిష్టిబొమ్మ దహనం. బీసీ సామాజిక వర్గానికి
చెందిన మంత్రి తలసాని శ్రీనివాస్యాదవ్పై అనుచిత వ్యాఖ్యలను నిరసిస్తూ గొల్లకుర్మలు రేవంత్రెడ్డిపై భగ్గుమన్నారు. యాదవ సమాజానికి క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. ఓవైపు సీఎం కేసీఆర్ బడుగులను అక్కున చేర్చుకుంటుంటే.. మరోవైపు టీపీసీసీ అధ్యక్షుడు అక్కసు వెల్లగక్కుతుండడం మీద యాదవ, కురుమ జేఏసీ సభ్యులు ఆందోళన వ్యక్తం చేశారు.