నీలగిరి: హైదరాబాద్లోని ఎల్బీనగర్ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్రెడ్డి సమీప బంధువు ప్రముఖ జనరల్ ఫిజీషియన్ డాక్టర్ జయశీల్రెడ్డి సోమవారం ఉదయం తన అమ్మమ్మ గ్రామమైన నల్లగొండ మండలం దుప్పలపల్లి గ్రామంలోని తన వ్యవసా య క్షేత్రం వద్ద అదృశ్యం అయ్యాడు. హైదరాబాద్లోని విద్యానగర్కు చెందిన దేవిరెడ్డి జగదీశ్వర్రెడ్డి సునందల ఏకైక కుమారుడు జయశీల్రెడ్డి(42) జమైకా దేశంలో డాక్టర్ కోర్సు పూర్తి చేసి అక్కడ కొంతకాలం ప్రాక్టిస్ చేసి రెండు సంవ త్సరాల క్రితం ఇండియాకు వచ్చాడు.
యుఎస్లో స్థిర పడ్డ తన సోదరి వద్ద ఉండడానికి ఏర్పాట్లు చేసుకుంటూ హైదరాబాద్లోనే ఉంటున్నాడు. కరోనా తీవ్రత వల్ల యుఎస్కు వెళ్లడం అలస్యం అయింది. దీంతో అతను తరుచూ నల్లగొండతో పాటు బంధువుల ఊర్లకు వెళ్తూ ఉండే వాడు. ఈ క్రమంలో మూడు రోజుల క్రితం డ్రైవర్ మల్లేశ్తో కలిసి నల్లగొండకు వచ్చాడు. నల్లగొండలోని తన బంధువుల ఇంటిలో ఉండి సోమవారం ఉదయం దర్వేశీపురానికి వెళ్లి దైవ దర్శనం చేసుకుని వ్యవసాయ క్షేత్రానికి వెళ్లాడు.
రోడ్డు పైనే కారు ఆపి డ్రైవర్ను అక్కడే ఉండమని చెప్పి తాను వాకింగ్ చేసి వస్తానని చెప్పి వ్యవసాయ క్షేత్రంలోకి వెళ్లా డు. క్షేత్రంలో ఉన్న చెరువుకుంట అలుగు పోస్తున్న ఫొటోలు ఇతర ఫొటోలు తీసి వాట్సప్ ద్వారా మేనమామ కోమటిరెడ్డి వినోద్రెడ్డికి పంపాడు, ఫొన్లో కూడా మాట్లాడాడు. జీతగాళ్లు ఎదురు పడగా వారి వద్ద కట్టె తీసుకుని తాను వాకింగ్ చేసి వస్తానని మీరు ఇంటికి వెళ్లి రమ్మని చెప్పి లోపలికి వెళ్లాడు.
సుమారు 60 ఎకరాల వ్యవసాయ క్షేత్రంలో ఎవరూ లేకపోవడం జయశీల్రెడ్డి ఒక్కడే ఉండడం, బయటకు రావడం అలస్యం కావడంతో డ్రైవర్ వ్యవసాయ క్షేత్రంలోకి వచ్చి వెతుకగా అచూకీ కనబడలేదు. దీంతో వెంటనే డ్రైవర్ వారి బంధువులకు సమాచారం అందించాడు.
యుఎస్కు వెళ్లడం ఇష్టం లేక..!
హైదరాబాద్లోని విద్యానగర్కు చెందిన జయశీల్రెడ్డి జమైకాలో డాక్టర్ కోర్సు పూర్తి చేసి జనరల్ ఫిజీషియన్గా అక్కడే కొంతకాలం ప్రాక్టిస్ కూడా చేశాడు.రెండు సంవత్సరాల క్రితం హైదరాబాద్కు వచ్చాడు.తన చెల్లెలు యుఎస్లో ఉంటుండ డంతో అక్కడికి వెళ్లి స్థిరపడాలని అక్కడే వైద్యం చేస్తూ వివాహం చేసుకోవాలని తల్లిదండ్రులు సూచించినట్లు సమాచారం.
కానీ డా. జయశీల్రెడ్డికి అక్కడకు వెళ్లడం ఇష్టం లేదని ఇక్కడే ఏదైనా దవాఖానలో భాగస్వామిగా చేరి వైద్యసేవలు అంది స్తానని వారికి చెప్పినట్లు బంధువులు పేర్కొన్నారు. గత నెల 4న కూడా వెళ్లాల్సి ఉండగా అనివార్య కారణాల వల్ల వాయి దా పడినట్లు తెలిపారు. కానీ ఈనెల 8న యుఎస్ వెళ్లేందుకు అంతా సిద్ధం అయినట్లు సమాచారం. యుఎస్కు వెళ్లడం ఇష్టం లేక వ్యవసాయ క్షేత్రంలో అత్మహత్య చేసుకున్నాడా.. లేక సమయం గడిచిపోవాలని సెల్ఫోన్ స్వీచ్ ఆఫ్ చేసి ఇతర ప్రాంతాలకేమైనా వెళ్లాడా అనే కోణంలోనూ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
రంగంలోకి పోలీసు బలగాలు
ప్రముఖ డాక్టర్ కావడంతో పాటు ఎమ్మెల్యే సమీప బంధువు కూడా కావడంతో అదృశ్యమైన జయశీల్రెడ్డి అచూకీ తెలు సుకునేందుకు పోలీసుల బలగాలు రంగంలోకి దిగాయి. నల్లగొండ డీఎస్పీ వెంకటేశ్వర్రెడ్డి ఆధ్వర్యంలో రూరల్ ఎస్ఐ రాజశేఖర్రెడ్డి పెద్ద ఎత్తున పోలీసు బలగాలను ఉపయోగించి అచూకీ కనుకొనేందుకు విశ్వప్రయత్నం చేస్తున్నారు. డాక్టర్ జయశీల్రెడ్డి ఆదృశ్యమైన వ్యవసాయ క్షేత్రం సుమారు 60 ఎకరాలు ఉండటం, పైగా వర్షం వస్తుండడంతో డోన్ కెమెరాలను ఉపయోగించి వెతికారు.
వాటి ద్వారా ఏలాంటి ఫలితం లేకపోవడంతో అగ్నిమాపక బృందాలు, స్పెషల్ పోలీసులు ప్రతి చెట్టును వదలకుండా తనిఖీలు చేశారు. అయినా ఫలితం లేకపోవడంతో సాయంత్రం నాలుగు గంటలకు జాగి లాలను తీసువచ్చి అచూకీ తెలుసుకునేందుకు ప్రయత్నం చేశారు. జాగిలాలు వ్యవసాయ క్షేత్రంలో చెరువుకుంట, వ్వయసాయ భావి వద్ద తచ్చాడుతూ ఉండడంతో అందులో దూకి అత్మహత్యకు ఏమైనా పాల్ప డ్డాడా అనే కోణంలో విచారణలో భాగంగా వాటిలోని నీటిని బయటకు తోడేందుకు ప్రయత్నం చేస్తున్నారు.
దుప్పలపల్లి గ్రామాన్ని చుట్టి వచ్చిన జాగిలం
కారులోనే షూ, సాక్సులు వదిలి వెళ్లడంతో వాటి వాసనతో జాగిలం ద్వారా చుట్టు పక్కల పరిసరాల ప్రాంతాల్లో అచూకీ కనుక్కునే ప్రయత్నం చేయగా జాగిలం నేరుగా వ్యవసాయ క్షేత్రంలోకి వెళ్లకుండా రెండు కిలోమీటర్ల దూరంలో ఉన్న దుప్పలపల్లి గ్రామంలోకి వెళ్లింది. అక్కడ రెండు మూడు వీధులు తిరిగి మళ్లీ రోడ్డుపైకి వచ్చింది. అక్కడ నుంచి పోలీసులు వాటిని వ్యవసాయ క్షేత్రంలోకి తీసుకెళ్లారు. అక్కడ జాగిలా ల ద్వారా దర్యాప్తు చేస్తున్నారు.
హుటాహుటిన ఘటనా స్థలానికి ఎమ్మెల్యేలు సుధీర్రెడ్డి, కంచర్ల
డాక్టర్ జయశీల్రెడ్డి ఎల్బీనగర్ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్రెడ్డికి సమీప బంధువు కావడంతో విషయం తెలిసిన వెంటనే ఆయన హుటాహుటిన ఘటనా స్థలానికి స్థానిక ఎమ్మెల్యే కంచర్ల భుపాల్రెడ్డి, మున్సిఫల్ చైర్మన్ మందడి సైదిరెడ్డిలతో కలిసి వచ్చారు. ఉదయం 11గంటలకు వ్యవసాయ క్షేత్రానికి చేరుకున్న ఎమ్మెల్యేలు రాత్రి వరకు వ్యవసాయ క్షేత్రం మొత్తం కలియ తిరిగారు. అక్కడ ఎం జరిగిందో జీతగాళ్లను అడిగి తెలుసుకున్నారు.